వామ్మో.. ఇదేం త్రో.. బౌండరీ నుండి వికెట్లను కొట్టింది?

praveen
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో కొన్ని కొన్ని సార్లు జట్టును గెలిపించేందుకు ఫీల్డర్లు చేసే విన్యాసాలు ప్రేక్షకులు అందరిని కూడా అబ్బురపరుస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇది ఎలా సాధ్యమైంది అని ప్రతి ఒక్కరు కూడా అవాక్ అవుతూ ఉంటారు. ఇలాంటిదే ఏదైనా జరిగిందంటే చాలు అది ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోవడం చూస్తూ ఉంటాం. ఇక ఇప్పుడు భారత్ వేదికగా జరుగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఇక ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతూ ఉన్నాయి. ప్రతి మ్యాచ్ కూడా హోరా హోరీగా జరుగుతూ ఉంది అని చెప్పాలి. ప్రేక్షకులకు అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది.

 ఇకపోతే ఇటీవలే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ముంబై ఇండియన్స్ గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్ లో భాగంగా అద్భుతంగా రాణించిన ముంబై ఇండియన్స్ ఘనవిజయాన్ని అందుకుంది అని చెప్పాలి. ఇప్పటికే ముంబై ఇండియన్స్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఓటమెరుగని జట్టుగా దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. ఇందులో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్ లో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగా. ఆ తర్వాత బలులోకి దిగిన గుజరాత్ జట్టు 107 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దీంతో 55 పరుగుల తేడాతో విజయం సాధించింది ముంబై ఇండియన్స్ జట్టు.

అయితే ఇక ఈ మ్యాచ్ మొత్తంలో హర్లిన్ డియోల్ త్రో మాత్రం హైలెట్ గా మారిపోయింది అని చెప్పాలి. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ 18 ఓవర్లో ఉమైరా, కెప్టెన్ హర్మన్ ప్రీత్  తో కలిసి బ్యాటింగ్ చేస్తుంది. అయితే బంతి అన్నాబెల్ సదర్ల్యాండ్ చేతిలో ఉంది. హార్మన్ ప్రీత్ కౌర్ మిడ్ ఆన్ దిశగా బౌండరీ వైపు షాట్ ఆడింది. అయితే అక్కడే ఫీల్డింగ్  చేస్తున్న హార్లీన్ డియోల్ ఇక బంతిని అందుకుంది. అయితే ఏకంగా బౌండరీ దగ్గర నుంచి నేరుగా వికెట్లను చూసి గురి కొట్టింది.  త్రో ఎలాగూ తగలదు అని భావించిన బ్యాట్స్మెన్ నెమ్మదిగానే పరిగెత్తుకుంటూ వచ్చింది. కానీ బంతి నేరుగా వచ్చి వికెట్లను తాకింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: