నాకు బదులు.. ధోని, కోహ్లీలను ఓపెనింగ్ పంపిస్తా : ఎల్లిస్ పెర్రి

praveen
ఐపీఎల్ తరహాలోనే ప్రస్తుతం ఎంతోమంది విదేశీ క్రికెటర్లు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగం అయ్యి భారత క్రికెట్ ప్రేక్షకులు అందరికీ ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగానే సాగుతుంది అని చెప్పాలి. సాధారణంగా ఐపీఎల్ లో మ్యాచ్లు జరిగిన సమయంలో ఇక తమ జట్టులో ఉన్న ఆటగాళ్లతో కొన్ని ఆసక్తికర ఇంటర్వ్యూలు నిర్వహించి ఆయా ఫ్రాంచైజీ లు  తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో కొన్ని వీడియోలను పోస్ట్ చేయడం లాంటివి చూస్తూ ఉంటాం.

 ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కూడా ఆయా ఫ్రాంచైజీలు ఇదే చేస్తున్నాయి అన్నది తెలుస్తుంది. జట్టులో ఉన్న స్టార్ ప్లేయర్లతో ఫన్నీ ఇంటర్వ్యూలు నిర్వహించి ఆసక్తికర ప్రశ్నలు అడిగి.. ఇక ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ప్రాతినిధ్యం భావిస్తున్న ఎల్లిస్ పెర్రి  కి సంబంధించిన ఒక ఆసక్తికర ఇంటర్వ్యూ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మీతో పాటు ఓపెనర్ గా కోహ్లీ, ధోని ని తీసుకునే ఛాన్స్ ఉంటే.. మీరు ఎవరిని మీ ఓపెనింగ్ జోడీగా ఎంపిక చేస్తారు అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పింది ఆస్ట్రేలియా క్రికెటర్.

 తాను ఇద్దరిలో ఎవరిని కూడా ఓపెనర్ గా సెలెక్ట్ చేసుకోను. ఎందుకంటే ఇద్దరిని ఓపెనర్ గా పంపించి ఇక నేను బయట స్టేడియంలో కూర్చొని వారు ఆడుతుంటే చూస్తూ ఎంజాయ్ చేస్తాను అంటూ ఆసక్తికర సమాధానం చెప్పింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేసిన ఇంటర్వ్యూలో ఇక ఈ వ్యాఖ్యలు చేసింది అని చెప్పాలి. ఈ మహిళా క్రికెటర్ సమాధానం తో ధోని,కోహ్లీ అభిమానులు ఫిదా అయిపోయారు. ఇకపోతే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా మూడు మ్యాచ్లలో కూడా ఘోర ఓటమి చవిచూసి పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: