టీమిండియాపై తొలి సెంచరీ.. కట్ చేస్తే.. 13 ఏళ్ల జైలు శిక్ష?
అయితే క్రిస్ లూయిస్ అటు దేశవాళి క్రికెట్లో మంచి ప్రదర్శన చేసి ప్రశంసలు అందుకున్నప్పటికీ ఇంగ్లాండు జాతీయ జట్టులో మాత్రం అంతంత మాత్రం గానే చోటు సంపాదించుకున్నాడు అని చెప్పాలి. క్రిస్ లూయిస్ అంతర్జాతీయ జట్టులో మొత్తం ఆరు విదేశీ పర్యటనలు చేశాడు. ఇక ఇందులో భారత పర్యటన కూడా ఉండడం గమనార్హం. 1993లో భారత పర్యటనకు వచ్చి చెన్నైలో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అక్కడ జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో అద్భుతమైన సెంచరీ చేసు అదరగొట్టాడు. అయితే అతనికి అదే తొలి అంతర్జాతీయ సెంచరీ అని చెప్పాలి. అతను సెంచరీ తో పోరాడినప్పటికీ ఇంగ్లాండ్ మాత్రం మ్యాచ్ ఓడిపోయింది.
ఇక ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఓడిపోయిన తర్వాత క్రిస్ లూయిస్ మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఇంకేముంది సీన్ కట్ చేస్తే అతని కెరియర్ అక్కడితో ముగిసిపోయింది. 2008 సంవత్సరంలో క్రిష్ లూయిస్ దాదాపు 1.5 కోట్ల విలువైన కోకైన్ తో ఘాట్వీక్ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. ఇక పోలీసులు అతని అరెస్టు చేశారు. తర్వాత విచారణలో అతను నేరానికి పాల్పడినట్టు నిజాలు నిర్ధారణ అయ్యాయి. దీంతో అతనికి 13 ఏళ్ల పాటు జైలు శిక్ష పడింది. కానీ మంచి ప్రవర్తన నేపథ్యంలో ఆరేళ్ల అనంతరం జైల నుంచి విడుదల చేశారు.