టీమిండియాపై తొలి సెంచరీ.. కట్ చేస్తే.. 13 ఏళ్ల జైలు శిక్ష?

praveen
ఇంగ్లాండ్ క్రికెటర్ క్రిస్ లూయిస్ గురించి కొంతమంది క్రికెట్ ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది.. ఎందుకు కొంతమంది క్రికెట్ ప్రేక్షకులకే అన్నాను అంటే అతను స్టార్ క్రికెటర్గా ఎదిగే సమయంలోనే ఇక చివరికి డ్రగ్స్ అనే ఉచ్చులో ఇరుక్కుపోయి ఇక జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితిలో ఏర్పడింది అని చెప్పాలి. అద్భుతమైన టాలెంట్ అతని సొంతమైనప్పటికీ.. దానిని బాగా సద్వినియోగం చేసుకోవడంలో మాత్రం అతను విఫలం అయ్యాడు. ఎందుకంటే అప్పటికే ప్రపంచ క్రికెట్లో మంచి క్రికెటర్ గా ఎదుగుతున్న సమయంలో అతని చెడు ప్రవర్తనతో ఎప్పుడు వార్తల్లో నిలిచేవాడు. క్రమశిక్షణ రాహిత్యం సహచరులతో దురుసుగా ప్రవర్తించడం ఇక కొన్నిసార్లు ప్రాక్టీస్కు ఆలస్యంగా రావడం ఇక తన కెరియర్ పై ఎంతగానో ప్రభావం చూపింది అని చెప్పాలి.

 అయితే క్రిస్ లూయిస్ అటు దేశవాళి క్రికెట్లో మంచి ప్రదర్శన చేసి ప్రశంసలు అందుకున్నప్పటికీ ఇంగ్లాండు జాతీయ జట్టులో మాత్రం అంతంత మాత్రం గానే చోటు సంపాదించుకున్నాడు అని చెప్పాలి. క్రిస్ లూయిస్ అంతర్జాతీయ జట్టులో మొత్తం ఆరు విదేశీ పర్యటనలు చేశాడు. ఇక ఇందులో భారత పర్యటన కూడా ఉండడం గమనార్హం. 1993లో భారత పర్యటనకు వచ్చి చెన్నైలో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అక్కడ జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో అద్భుతమైన సెంచరీ చేసు అదరగొట్టాడు. అయితే అతనికి అదే తొలి అంతర్జాతీయ సెంచరీ అని చెప్పాలి. అతను సెంచరీ తో పోరాడినప్పటికీ ఇంగ్లాండ్ మాత్రం మ్యాచ్ ఓడిపోయింది.

 ఇక ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఓడిపోయిన తర్వాత క్రిస్ లూయిస్ మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఇంకేముంది సీన్ కట్ చేస్తే అతని కెరియర్ అక్కడితో ముగిసిపోయింది. 2008 సంవత్సరంలో క్రిష్ లూయిస్ దాదాపు 1.5 కోట్ల విలువైన కోకైన్ తో ఘాట్వీక్ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. ఇక పోలీసులు అతని అరెస్టు చేశారు. తర్వాత విచారణలో అతను నేరానికి పాల్పడినట్టు నిజాలు నిర్ధారణ అయ్యాయి. దీంతో అతనికి 13 ఏళ్ల పాటు జైలు శిక్ష పడింది. కానీ మంచి ప్రవర్తన నేపథ్యంలో ఆరేళ్ల అనంతరం జైల నుంచి విడుదల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: