రోహిత్ కి విరాట్ క్షమాపణలు.. వీడియో వైరల్?

Purushottham Vinay
ఇక ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీ సాధించాడు.అయితే, టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 2వ రోజు ఆట మొదటి సెషన్‌లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో మిస్టేక్‌తో రోహిత్ రనౌట్ అయ్యే ఛాన్స్ ని తప్పించుకున్నాడు. ఒకవేళ ఇదే జరిగి ఉంటే విరాట్‌పై చాలా దారుణంగా విమర్శలు వచ్చి ఉండేవి. ఆ తర్వాత రోహిత్ శర్మ పుంజుకుని మొత్తం 212 బంతుల్లో 120 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా పెవిలియన్ చేర్చాడు.ఇక విరాట్ కోహ్లీ కేవలం 12 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. అయితే, విరాట్ కోహ్లీ చేసిన తప్పిదం వల్ల రోహిత్ శర్మ కూడా తృటిలో ఔట్ కాకుండా తప్పించుకున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.మొదటి టెస్టు రెండో రోజు లంచ్ విరామ సమయానికి భారత జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. లంచ్‌కు ముందు, విరాట్ కోహ్లీ తప్పిదం వల్ల రోహిత్ శర్మ తృటిలో రనౌట్ నుంచి తప్పించుకున్న సంఘటన ఇప్పుడు బాగా వైరల్‌గా మారింది. 


విరాట్ కోహ్లి ఈ తప్పును గ్రహించిన వెంటనే, కెప్టెన్ రోహిత్ శర్మకు తన సైగలలో క్షమాపణలు చెప్పాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తల వంచి, వెంటనే థంబ్స్-అప్ చూపించి క్షమించినట్లు తాను కూడా ఓకే చూపించాడు.ఇండియా ఇన్నింగ్స్‌లో 48వ ఓవర్‌లో నాథన్ లియాన్ బౌలింగ్‌లో ఈ ఘటన అనేది చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఐదో బంతికి విరాట్ ఇంకా అలాగే రోహిత్ మధ్య సమన్వయం చెదిరిపోయింది. స్ట్రైక్‌లో ఉన్న విరాట్ కోహ్లి బంతిని మిడ్ వికెట్ వైపు ఆడాడు. అప్పుడు కోహ్లీ సింగిల్‌ను పొందగలనని భావించాడు.తరువాత రెండు-మూడు అడుగులు ముందుకు వేసి, ఆ ప్రమాదాన్ని చూసి తిరిగి వచ్చాడు. అయితే, నాన్-స్ట్రైకర్ ఎండ్ నుంచి పరుగు తీసుకోవడానికి రోహిత్ శర్మ క్రీజు మధ్యలోకి వచ్చేశాడు. విరాట్ కోహ్లీ వెనక్కు తగ్గడం గమనించిన రోహిత్ శర్మ, వెనుకకు వెళ్లాడు. విరాట్ కోహ్లీ తప్పిదం వల్ల అతను తృటిలో రనౌట్ నుంచి తప్పించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: