విరాట్ కోహ్లీపై డివిలియర్స్ పోస్ట్.. డీకే రిప్లై వైరల్?

praveen
గత ఏడాది ఆసియా కప్ లో మునుపటి ఫామ్ ను అందుకున్న విరాట్ కోహ్లీ.. తిరుగులేని ప్రదర్శనతో దూసుకుపోతున్నాడు అన్న విషయం తెలిసిందే. తాను ఎందుకు ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమమైన ఆటగాడు అయ్యాడో అన్న విషయాన్ని ఇక తన చాటింగ్ ప్రదర్శనతోనే ప్రతి ఒక్కరికి కూడా నిరూపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక కొత్త ఏడాదిలో కూడా సెంచరీల ప్రభావాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఇటీవలే అటు శ్రీలంకతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో సెంచరీ చేసే అదరగొట్టిన విరాట్ కోహ్లీ.. మూడో వన్డే మ్యాచ్లో కూడా మరో అదిరిపోయే సెంచరీ తో ఆకట్టుకున్నాడు.

 ఈ క్రమంలోనే తన కెరియర్ మొత్తంలో 74వ సెంచరీ నమోదు చేసిన విరాట్ కోహ్లీ.. ఇక వన్డే ఫార్మాట్లో 46వ సెంచరీ నమోదు చేయడం గమనార్హం. కేవలం 110 బంతుల్లోనే 166 పరుగులు చేసి వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడాడు విరాట్ కోహ్లీ. దీంతో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ పై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక విరాట్ కోహ్లీకి అత్యంత సన్నిహితుడు అయిన ఏబి డివిలియర్స్ ఇక విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ గురించి ప్రస్తావిస్తూ ప్రశంసల వర్షం కురిపించాడు.

 ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ డిఫరెంట్ లెవెల్ అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు అని చెప్పాలి. అయితే 360 ప్లేయర్ ఎబి డివిలియర్స్ పెట్టిన పోస్ట్ కి భారత వెటరన్ ఆటగాడు దినేష్ కార్తీక్ ఆసక్తికరమైన రీతిలో రిప్లై ఇచ్చాడు అని చెప్పాలి. దీనిని డిఫరెంట్ లెవెల్ కాదు వీర లెవెల్ అని అంటారు. విరాట్ కోహ్లీని అడుగు దీని అర్థం ఏంటో చెబుతాడు. ఐపీఎల్ లో కలుద్దాం అంటూ ఒక వ్యాఖ్యను జోడించి ఏబి డివిలియర్స్ పోస్ట్ కి దినేష్ కార్తీక్ రిపోర్టు చేశాడు అని చెప్పాలి. ఇక ఈ రెండు పోస్టులకు కూడా విరాట్ కోహ్లీ అభిమానులు లైకులు కొడుతూ మద్దతు తెలుపుతూ ఉన్నారు అనిచెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: