పాండ్యపై గుడ్లు నిమిరిన కోహ్లీ.. వైరల్ వీడియో?

praveen
ఇప్పటికే భారత పర్యటనకు వచ్చిన శ్రీలంకతో  టి20 సిరీస్ ఆడి ఇక సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా ఇక ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో కూడా శుభారంభం చేసింది అన్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో టీమిండియా 67 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది అని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్లో భాగంగా అటు విరాట్ కోహ్లీ సెంచరీ తో చెలరేగిపోయి ఎన్నో రికార్డులను కొల్లగొట్టాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ మ్యాచ్ కి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

 సాధారణంగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత చురుకుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతను బ్యాటింగ్ కి వచ్చాడు అంటే చాలు వికెట్ల మధ్య ఎంతో వేగంగా పరిగెత్తాలని అనుకుంటూ ఉంటాడు. అయితే తాను మాత్రమే కాదు తనతో పాటు బాటింగ్ చేస్తున్న మరో ఆటగాడు కూడా తన వేగాన్ని అందుకోవాలి అని భావిస్తూ ఉంటాడు. కొన్ని కొన్ని సార్లు కోఆర్డినేషన్ లోపిస్తే మాత్రం కోహ్లీ ఆగ్రహంతో ఊగిపోతూ ఉంటాడు అని చెప్పాలి. మొదటి వన్డే మ్యాచ్లో కూడా ఇలాంటిదే జరిగింది.

 కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 43వ ఓవర్లో కస్సున్ రజిత బౌలింగ్ వేశాడు. ఇక ఆఖరి బంతికి కోహ్లీ స్క్వేర్ లెగ్ మీదుగా బంతిని బాదాడు. ఈ క్రమంలోనే సింగిల్ కోసం ప్రయత్నించాడు విరాట్ కోహ్లీ. అప్పటికే క్రీజును వీడి సగం దూరం వరకు వచ్చేసాడు అని చెప్పాలి  అయితే మరోవైపున ఉన్న హార్దిక్ పాండ్యా మాత్రం పరుగు చేసేందుకు నిరాకరించాడు. దీంతో ఇది గమనించిన విరాట్ కోహ్లీ మళ్లీ వెనక్కు పరుగు తీయడంతో రన్ అవుట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనతో కోహ్లీ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏకంగా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పై గుడ్లు నిమిరాడు విరాట్ కోహ్లీ. 81 పరుగులతో అప్పటికే మంచి ఊపు మీది ఉన్న కోహ్లీ రన్ అవుట్ అయితే సెంచరీ మిస్ అయ్యేవాడు. అందుకే అంతలా ఆగ్రహం తెచ్చుకున్నాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: