సెమీస్ లో ఓడిన టీమిండియాకు.. ఎంత ప్రైజ్ మనీ వచ్చిందో తెలుసా?

praveen
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో భాగంగా టీమ్ ఇండియా కప్పు గెలుచుకొని వస్తుంది అనుకుంటే పూర్తిగా నిరాశపరిచింది అన్న విషయం తెలిసిందే. సూపర్ 12 మ్యాచ్లలో అదరగొట్టిన టీమిండియా అదే జోరును అటు సెమి ఫైనల్లో మాత్రం కొనసాగించలేకపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూసి ఇంటిదారి పట్టింది టీమిండియా. ఇక టీమిండియా ఇలా వరల్డ్ కప్ లో భాగంగా పెద్దగా ప్రభావవంతమైన ఆటతీరు కనబరచకపోవడానికి కారణం అటు ఓపెనర్ల వైఫల్యం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ముఖ్యంగా కెప్టెన్ గా ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించినప్పటికీ ఒక ఆటగాడిగా మాత్రం రోహిత్ శర్మ పూర్తిగా విఫలం అయ్యాడు అని చెప్పాలి. భారీ పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభాలు ఇవ్వాల్సిన రోహిత్ శర్మ తక్కువ పరుగులకే వికెట్ కోల్పోయి మొదట్లోనే జట్టును కష్టాల్లోకి నెట్టేసాడు. ఇక ఇలా రోహిత్ శర్మ వైఫల్యమే టీమిండియా ఓటమికి ఒక రకంగా కారణమైంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంటే సెమిస్ వరకు వెళ్లిన టీమిండియా జట్టు వరల్డ్ కప్ లో భాగంగా ఎంత ప్రైజ్ మనీ గెలుచుకుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

 సెమీఫైనల్ ఓడిపోయిన టీమ్ ఇండియా నాలుగు లక్షల డాలర్ల ప్రైజ్ మనీ గెలుచుకుంది. అంటే భారత కరెన్సీ ప్రకారం 3.22 కోట్ల రూపాయలు. ఇక మొదటి సెమి ఫైనల్లో ఓడిన న్యూజిలాండ్కు కూడా ఇంతే మొత్తం దక్కుతుంది. ఇక గ్రూప్ దశలో ఈ జట్లు సాధించిన ఒక్కో విజయానికి 4,0000 డాలర్లు అంటే 32 లక్షలకు పైగానే అందుకున్నాయి. ఇక గ్రూప్ దశలో భారత జట్టు నాలుగు మ్యాచ్ లలో  విజయం సాధించడంతో ప్రైజ్ మనీ తో పాటు 1.2 కోట్లకు పైగా అదనపు నగదు బహుమతి కూడా లభిస్తుంది అని చెప్పాలి.. ఇకపోతే వరల్డ్ కప్ లో ఓడిపోయిన టీమ్ ఇండియా పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: