వావ్.. ధోని ఫాన్స్ కి ఇంత కంటే గుడ్ న్యూస్ ఉండదేమో?
ఇక ఆ తర్వాత అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. లీగ్ దశలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ నుండి నిష్క్రమించింది. అయితే వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ కి ధోని అందుబాటులో ఉంటాడా.. అసలు క్రికెట్ ఆడతాడా లేదా అన్నది కూడా అభిమానుల్లో నెలకొంది ప్రశ్న. ఈ క్రమంలోనే ధోని ఆడితే బాగుండని ఎంతోమంది అభిమానులు గట్టిగానే కోరుకునాట్టున్నారు. ఎందుకంటే ఇది నిజం కాబోతుంది. మరోసారి ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్గా ధోనీ వ్యవహరించాడు. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది.
చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీవిశ్వనాథన్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి అని చెప్పాలి. ఈ విషయం తెలిసిన వారు మహేంద్రసింగ్ ధోని అభిమానులకు ఇంతకంటే గొప్ప శుభవార్త ఉంటుందా అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం. మరోసారి మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ కప్ కొట్టడం ఖాయం అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు ఎంతోమంది అభిమానులు. మరి ఈ ఏడాది పేలవ ప్రదర్శన నేపథ్యంలో వచ్చే ఏడాది జట్టులో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.