వామ్మో ఇదేమీ సెలబ్రేషన్స్ రా నాయన.. వికెట్ తీయగానే ఏం చేశాడంటే?

praveen
సాధారణంగా క్రికెట్ లో ఒక్కొక్క ఆటగాడికి ఒక్క యూనిక్ స్టైల్ ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక మైదానంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఏదైనా సెలబ్రేషన్స్ చేసుకోవాలి అంటే అందరి కంటే భిన్నంగా కాస్త కొత్తగా సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. బౌలర్ వికెట్ తీసినప్పుడు లేదా బ్యాట్స్మెన్ సెంచరీ లేదా హాఫ్ సెంచరీ చేసినపుడు ఇక ఇలాంటి సెలబ్రేషన్స్ ఎక్కువగా మైదానంలో కనిపిస్తూ ఉంటాయి అనే విషయం తెలిసిందే.

 అయితే కొంత మంది క్రికెటర్లు ఇలాంటి సెలబ్రేషన్స్ తోనే సోషల్ మీడియాలో ఎక్కువగా హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటారూ. ఎందుకంటే చిత్రవిచిత్రమైన సెలబ్రేషన్స్ చేసుకుంటూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఇలాంటి విచిత్రమైన సెలబ్రేషన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సబ్ రీజియన్ క్వాలిఫైయర్  గ్రూప్ ఏ  లో సెర్బియా,  ఐల్ ఆఫ్ మాన్ తలపడ్డాయి. ఇక ఈ మ్యాచ్లో భాగంగా అయో మేనే ఎగిజి
 నాలుగు వికెట్లతో అదరగొట్టాడు. వికెట్ తీసిన తర్వాత వింత సెలబ్రేషన్స్ చేసుకుని వార్తల్లో నిలిచాడు.

 వికెట్ తీసిన అనంతరం ఆ సంతోషంలో రెండుసార్లు ఫ్లిప్ చేసి ఆ తర్వాత నేల పై తన చేతులను చాచి అలాగే పడుకున్నాడు  ఇక సదరు బౌలర్ వింత సెలబ్రేషన్స్ మైదానంలో ఉన్న వారందరికీ కూడా నవ్వు తెప్పించింది అనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఐసీసీ ఇటీవలే తమ అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేయడంతో ఇక వైరల్ గా మారిపోయింది  అయితే వంద వికెట్లు సాధించిన ఆనందంలో ఇలాంటి సెలబ్రేషన్స్ చేస్తున్నాడు సెర్బియా క్రికెటర్ అయో మేనే ఎగిజి అంటూ ఒక కాప్షన్ కూడా జత చేసింది ఐసీసీ. ఏది ఏమైనా ఇక ఇలాంటి వింత సెలబ్రేషన్స్ మాత్రం క్రికెట్ ప్రేక్షకులు ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు అని చెప్పాలి.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: