టీ20ల్లో.. అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాళ్ళు వీరే?

praveen
ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది టీమిండియా. ఈ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్ ఆడుతుంది అనే  విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టి20 సిరీస్ లో భాగంగా అద్భుతమైన ప్రదర్శన చేసింది. వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించడంతో  ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది. అయితే మూడో మ్యాచ్లో కూడా అద్భుతంగా ఆడుతుందని  అందరూ అనుకొంటారు. కానీ ఊహించని విధంగా ఓటమి పాలయింది అన్న విషయం తెలిసిందే. అయితే  టీమిండియా ఓటమి పాలు అయినప్పటికీ యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ మాత్రం వీరోచిత పోరాటాన్ని కనబరిచాడు అని చెప్పాలి.

 ఏకంగా 57 బంతుల్లోనే 117 పరుగులు చేసి సెంచరీతో చెలరేగిపోయాడు సూర్య కుమార్ యాదవ్. ఇలా అద్భుతమైన ప్రదర్శన చేసిన నేపథ్యంలో టీమిండియా ఘనవిజయం సాధిస్తుందని అందరు అనుకున్నారు. కానీ మిగతా బ్యాట్స్మెన్లు మాత్రం పూర్తిగా విఫలం కావడంతో చివరికి టీమిండియాకు ఓటమి తప్పలేదు అనేది మాత్రం తెలుస్తుంది. దీంతో ఇక సూర్యకుమార్ యాదవ్ చేసిన పోరాటం వృధా గానే మిగిలిపోయింది. అయితే ఇటీవలే సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగిన నేపథ్యంలో టీ20 లో అత్యధిక స్కోరు చేసిన టీమిండియా బ్యాట్స్మెన్ ఎవరు అన్న విషయం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

 ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే.. 2017లో శ్రీలంకపై రోహిత్ శర్మ 118 పరుగులు చేశాడు. ఇదే ఇప్పటికీ అత్యధిక వ్యక్తిగత స్కోరు గా కొనసాగుతోంది. ఇటీవలే మూడో మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ ఇంగ్లండ్ పై 117 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. 2018 లో రోహిత్ శర్మ వెస్టిండీస్ పై 111 పరుగులు చేశాడు. 2016లో కె.ఎల్.రాహుల్ వెస్టిండీస్పై 110 పరుగులతో రాణించాడు. అయితే  టీమిండియా తరఫున నాలుగో స్థానంలో వచ్చి సెంచరీ చేసింది మాత్రం సూర్యకుమార్ యాదవ్ మాత్రమే అని చెప్పాలి. దీంతో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: