భారత్-కివీస్ తొలి మ్యాచ్ అనుమానమే..!
ప్రస్తుతం ఇదే పరిస్థితి ఉత్తర భారతంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఉంది. గాలిలో నాణ్యతా సూచి ప్రస్తుతం ప్రమాదకర స్థాయికి చేరుకుందని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కూడా. ప్రస్తుతం జైపూర్ సిటీలో కాలుష్యం భారీస్థాయిలో పెరిగింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అయితే బాబోయ్ అనేలా ఉంది. అటు పొగ మంచు కూడా తొడవ్వడంతో... గాలి నాణ్యతా సూచి 350 వద్దకు చేరుకుంది. దీపావళి తర్వాత పరిస్థితి మరింత విషమంగా తయారైంది. జైపూర్లో పరిస్థితి మరో నాలుగు రోజులు ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో కివీస్తో జరిగే తొలి టీ 20 మ్యాచ్ జరిగేది లేదని అనేది ఆ రోజు మాత్రం తెలిసే అవకాశం ఉంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత జైపూర్ స్టేడియం ఓ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్కు ఆతిధ్యం ఇస్తోంది. ఈ స్టేడియంలో ఇప్పటి వరకు ఒక్క టీ 20 మ్యాచ్ కూడా జరగలేదు. కొవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న వారికి మాత్రమే స్టేడియంలోకి అనుమతి ఉంటుందని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. ఇప్పటికే టికెట్ల అమ్మకం కూడా దాదాపు పూర్తయ్యాయి.