రిషబ్ పంత్ స్థానంలో ఎవరు రాబోతున్నారు?

praveen
ప్రస్తుతం సీనియర్ ఆటగాళ్లతో కూడిన టీమ్ ఇండియా జట్టు ఇంగ్లండ్ పర్యటన లో ఉంది అన్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగానే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడింది టీమ్ ఇండియా జట్టు. ఎన్నో అంచనాల మధ్య  రంగంలోకి దిగిన టీమిండియా జట్టు అందరినీ తీవ్ర నిరాశ పరిచింది అని చెప్పాలి.  వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ టీమిండియా మధ్య  మ్యాచ్ జరిగింది  అయితే ఇక ఈ మ్యాచ్ లో అందరికీ హాట్ ఫేవరెట్గా టీమిండియా బరిలోకి దిగింది. కానీ టీమిండియా మాత్రం ఊహకందని విధంగా అన్ని విభాగాల్లో కూడా పూర్తిగా విఫలం అయిపోయింది.  అంతేకాదు వరుణుడు కూడా ఇబ్బందులు సృష్టించడంతో చివరికి టీమిండియా ఓటమి పాలయింది.

 న్యూజిలాండ్ జట్టు విశ్వవిజేతగా నిలిచింది. అయితే ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ పూర్తయిన తర్వాత ఇరవై రోజుల పాటు సెలవులు ఎంజాయ్ చేసింది టీమిండియా జట్టు. ఇక ఇప్పుడు మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఆగస్టు 4వ తేదీ నుంచి టీమ్ ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ తో తలపడబోయే టెస్టు జట్టులో ఏమైనా మార్పులు చేస్తారా అన్నది ప్రస్తుతం ఆసక్తి కరం గా మారిపోయింది. ముఖ్యంగా వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో రాణించని ఆటగాళ్లపై వేటు పడే అవకాశం ఉంది అని ప్రస్తుతం విశ్లేషకులు భావిస్తున్నారు.

 అయితే గత కొంత కాలం నుంచి ఎంతో అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్నాడు రిషబ్ పంత్. కానీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం తేలిపోయాడు. కనీస పరుగులు చేయలేకపోయాడు.  దీంతో ఇక ఇంగ్లాండు సిరీస్కు ముందు పంత్ పై వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రిషబ్ పంత్ స్థానంలో కె.ఎల్.రాహుల్ లేదా వృద్ధిమాన్ సాహా ను జట్టులోకి తీసుకోవాలని అనుకుంటుందట టీమిండియా యాజమాన్యం. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లు రిషబ్ పంత్ అంచనాలను అందుకోలేక పేలవ ప్రదర్శన చేయడంతోనే అతనిపై వేటు వేసేందుకు టీమిండియా యాజమాన్యం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇక ఓపెనర్ శుభమాన్ గిల్ గాయం బారిన పడడంతో అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు కేఎల్ రాహుల్ ని ఓపెనర్ గా జట్టులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: