విశాఖ వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో వన్డే లో ఓపెనర్లు రాహుల్ , రోహిత్ శర్మ అర్ద శతకతాలతో చెలరేగడంతో టీమిండియా 27ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 156పరుగులు చేసింది. ప్రస్తుతం రాహుల్ 81*,రోహిత్ శర్మ 71*పరుగులతో క్రీజ్ లో వున్నారు. చక్కటి సమన్వయం తో ఆడుతున్న ఈ జోడి స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టిస్తుంది. ఇక మరోవైపు వెస్టిండీస్ బౌలర్లు ఈజోడిని విడదీయడానికి నానా తంటాలు పడుతున్నారు. కెప్టెన్ పొలార్డ్ పదే పదే బౌలర్లను మార్చిన ఫలితం లేకుండా పోయింది. ఓపెనర్ల దూకుడుతో భారత్ భారత్ స్కోర్ పై కన్నేసింది.
ఇక ఈమ్యాచ్ లో భారత్.. శివమ్ దూబే స్థానం లో ఫాస్ట్ బౌలర్ శ్రద్ధుల్ ఠాకూర్ ను తీసుకోగా విండీస్ రెండు మార్పులు చేసింది. తొలి వన్డే లో విఫలమైన ఓపెనర్ v DEODHAR' target='_blank' title='సునీల్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సునీల్ అంబ్రీస్ స్థానంలో ఏవిన్ లెవిస్ జట్టులోకి రాగ స్పిన్నర్ హేడెన్ వాల్ష్ ను తప్పించి అతని స్థానంలో పెర్రీ ని తీసుకుంది. సిరీస్ పై ఆశలు సజీవంగా ఉండాలంటే భారత్ ఈ మ్యాచ్ లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి.