హెరాల్డ్ సెటైర్ : సుప్రింకోర్టు సంచలన తీర్పు..ఏమి చేయాలో అర్ధంకాలేదా ?
అసలింతకు సుప్రింకోర్టు ప్రశాంత్ కు విధించిన ఫైన్, ఫైన్ చెల్లించలేకపోతే జైలుశిక్ష విధించటం వెనుక పెద్ద కతే ఉంది. అదేమిటంటే సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్టేతో పాటు గతంలో జడ్జీలుగా పని చేసిన కొందరిపై ప్రశాంత్ ట్విట్టర్లో అనుచితమైన వ్యాఖ్యలు చేశాడట. నిజానికి ప్రశాంత్ కూడా పేరున్న లాయరే. ఎన్నో కేసులను తనంతట తానుగా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలుగా వేసి సుప్రింకోర్టులో వాదించి గెలిచిన ఘటనలు చాలానే ఉన్నాయి. చాలామంది లాయర్ల లాగ క్లైంటును బట్టి కాకుండా కేసులోని మెరిట్ ను బట్టి మాత్రమే కేసును టేకప్ చేస్తాడనే పేరు ప్రశాంత్ కు ఉంది. క్లైంట్ తరపున ఒకసారి కోర్టులో వాదిస్తే లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసే లాయర్లున్న ఈరోజుల్లో కూడా మెరిట్ ను మాత్రమే చూసి కేసు టేకప్ చేయటమంటే మామూలు విషయం కాదు. అందుకనే ప్రశాంత్ అంటే యావత్ దేశంలో అంతటి సానుకూల దృక్పదముంది.
ఇక విషయానికి వస్తే బాబ్డే మీద తాను చేసిన కామెంట్ తప్పని తెలియగానే ప్రశాంత్ వెంటనే క్షమాపణ చెప్పుకున్నాడు. కానీ జడ్జీల మీద చేసిన కామెంట్లను మాత్రం వాపసు తీసుకోవటానికి కానీ క్షమాపణ చెప్పటానికి కానీ ఈ లాయర్ అంగీకరించలేదు. ఎందుకంటే కొందరు జడ్జీల మీద ప్రశాంత్ నేరుగా కామెంట్లేమీ చేయలేదు. గతంలో కొందరు జడ్జీలు మరికొందరు న్యాయమూర్తులపై చేసిన కామెంట్లనే ఈ లాయర్ తన ట్విట్టర్లో కేవలం రీ కాల్ చేశాడంతే. దాన్నే సుప్రింకోర్టు సూమోటోగా తీసుకుని ప్రశాంత్ పై కేసు నమోదు చేసింది. తాను చేసినది తప్పయితే గతంలో జడ్జీలు వ్యాఖ్యలు చేసినపుడు వాళ్ళపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ చేసిన వాదనకు సుప్రింకోర్టు నుండి సమాధానం రాలేదు. వాళ్ళపై అప్పట్లో చర్యలు తీసుకోలేని సుప్రింకోర్టు అవే వ్యాఖ్యలను తాను గుర్తు చేసింది తప్పెలాగవుతుందంటూ చేసిన వాదనకు కోర్టు సమాధానం చెప్పలేకపోయింది.