ఆర్టీసీ సమ్మె జరుగుతున్న తరుణంలో,కార్మికుల జీతాలు చెల్లింపుపై రాష్ట్ర హైకోర్టులో సోమవారం పలు వాదనలు జరిగాయి.కార్మికుల డిమాండ్లకు పిలుపునిస్తూ ఆర్టీసీ కార్మికులు అక్టోబర్ 5న సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి అందరికి తెలిసింది. సమ్మె విషయంలో ఆర్టీసీ కార్మికుల సెప్టెంబర్ నెల జీతాలు యాజమాన్యం ఇంకా చెల్లించలేదు. దీంతో ఆర్టీసీ కార్మికులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.సోమవారం జరిగిన విచారణలో.. ఆర్టీసీ కార్పొరేషన్ వద్ద కేవలం రూ. 7.5 కోట్లే రూపాయలే ఉన్నాయని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల వేతనాలు చెల్లించాలంటే రూ.224 కోట్లు రూపాయలు కావాలని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు.
అయితే, ఇంతకాలం సమ్మె కొనసాగుతున్నా ..50 శాతం బస్సులను తిప్పుతున్నామని ప్రభుత్వంపేర్కొంది.మరి ఇప్పటివరకు వచ్చిన ఆదాయమంతా ఎక్కిడికి మాయం అయింది అని కార్మికుల తరపు పిటిషనర్ కోర్టులో వాదించారు. తక్షణమే 48 వేల మంది ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన సెప్టెంబర్ నెల జీతాలు ఇవ్వాలని వారు కోరారు.
ఇరుపక్షాల వాదనలు విని,హైకోర్టు ఈ నెల 28న ఆర్టీసీపై డివిజన్ బెంచ్లో విచారణ అనంతరం,వేతనాల చెల్లింపు పిటిషన్పై విచారణ చేపడతామమని వెల్లడించింది. తదుపరి విచారణ 29కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.ఇప్పటివరకు తిప్పుతున్న బస్సులు పై వచ్చిన ఆదాయమెక్కడ అని పిటిషనర్ ఆర్టీసీ యాజమాన్యాని ప్రశ్నించారు. తదుపరి విచారణ అక్టోబర్ 24కు వాయిదా వేశారు.
ఇది ఇలా ఉండగా.. గత బుధవారం ఇదే విషయంపై కోర్టులో విచారణ జరగగా..సెప్టెంబర్ నెల వేతనాలు చెల్లించేందుకు ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించి,సోమవారం నాటికి జీతాలు ఆర్టీసీ కార్మికులకు చెల్లిస్తామని,రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం లో తెలిపారు.సమ్మె కొనసాగుతున్న సందర్భంగా వేతనాలు ఇచ్చేందుకు తగిన సిబ్బంది లేకపోవటం వల్ల జాప్యం అయింది అని కోర్టుకు విన్నవించుకుంది.సోమవారం లోపు కార్మికులకు జీతాలు ఇచ్చే ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసారు.