ఆ మాజీ ఎమ్మెల్యే గ్రామ సచివాలయం ప్రారంభించడం ఏమిటి??
చీరాల నియోజకవర్గంలో ఇటీవలి ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్ గెలవలేకపోయారు . వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గాలి గట్టిగా ఉన్న సమయంలో కూడా - జగన్ హవాలో కూడా చీరాల్లో ఆమంచి గెలవలేకపోయారు. అంతకు ముందు ఎన్నికల్లో ఇండిపెండెంట్ గానే గెలిచినా ఆమంచి.. ఈ సారి జగన్ హవా ఉన్నా విజయం సాధించలేక పోయాడు. ఆమంచి స్థానంలో వేరే ఎవరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినా..వాళ్ళు గెలిసేనావారు అని స్థానికులు అంటున్నారు.
ఇది మరింత విసుగు, వెక్కిరిస్తున్నట్టుగా ఉంది. అయితే ఇలా అధికార పార్టీకి చెందిన ఓడిపోయిన వ్యక్తి అధికారిక కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించేయడం చాల విడ్డూరంగా ఉందని పలు విశ్లేషకులు అంటున్నారు. ఓడిపోయిన వ్యక్తి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్కొనడం తగ్గించుకుంటే మంచిదని చురకలు అంటిస్తూ ఉన్నారు.