ప్రజాస్వామ్య నిలబడాలి అంటే ఆరోపణలను స్వీకరించాలి అన్న సుప్రీం కోర్ట్ జడ్జ్
ఎన్నోసార్లు సంఘవిద్రోహ శక్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాజంలో విషం చేయడానికి ప్రయత్నిస్తాయి. ఆ ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వం చేసిన పనులకు రంగులు ఉన్నవి లేనివి చెబుతూ ఎగదోస్తూ గొడవలు సృష్టిస్తుంటారు. ఇటువంటి వారిని గుర్తించి సవరణ చేయకపోతే వాళ్లు చీడపురుగుల సమాజంలో పెరుగుతూ చివరకు దేశానికే హాని చేస్తారు. కానీ పూర్తిగా ప్రజాస్వామ్య దేశంలో నోరు విప్పి ప్రభుత్వాన్ని విమర్శించకూడదు అనేటువంటి రూలేమీ లేదు.
తాజాగా సుప్రీంకోర్టు జస్టిస్ ఒకచోట ప్రసంగిస్తూ ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళు సమాజం నుంచి పుట్టుకు రావాలని అలా చేయడానికి ప్రజలు భయపడే రోజున ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది అని అభిప్రాయపడ్డారు. ఇది తన వ్యక్తిగత నిర్ణయమే కానీ హైకోర్టు జస్టిస్ గా ఇస్తున్న నిర్ణయం కాదు అని కూడా పేర్కొన్నారు.
ప్రభుత్వమే కాదు దేశ సైన్యం మరియు జడ్జీలను కూడా ప్రజలు ప్రశ్నించాలని అలా ప్రశ్నిస్తున్న అప్పుడే మేము కూడా మా తప్పులు సవరించుకునే అవకాశం వస్తుంది అని వ్యాఖ్యానించారు. కానీ ఈ హక్కును అధిగమించి దుర్వినియోగం చేసుకుంటే మాత్రం దేశ ప్రభుత్వానికి దండన విధించే హక్కు కూడా ఉంది అని ఆయన గుర్తు చేశారు.