పని పాట లేని లోకేష్ విష ప్రచారం చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి టీడీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నారా లోకేష్ ప్రయత్నిస్తున్నాడని వైయస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శైలజ చరణ్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లోకేష్ కు ఏ పాటి అవగాహన ఉందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అని అన్నారు. లోకేష్ పప్పు అవగాహనా రాహిత్యానికి, అసత్య ప్రచారాలకు ప్రజలు నవ్వుకున్నారని విమర్శించారు. గతంలో టిడిపి ప్రభుత్వం అవలంభించిన ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. అయినా తెలుగు తమ్ముళ్లకు ఇంకా బుద్ధి రాలేదు అని ఆమె ధ్వజమెత్తారు.
తుగ్లక్ పాలన ఎవరిదో ప్రజలందరూ అర్థం చేసుకున్నారని అన్నారు. అవగాహన రాహిత్యంతో, అసత్య ప్రచారాలతో ఇంకా ప్రజలను మోసం చేసేందుకు పూనుకోవడం సహించరానిదన్నారు. ఇదే ధోరణిని అవలంభిస్తే..ప్రజలు తరిమికొట్టే రోజు వస్తుందన్నారు. లోకేష్ అవాకులు చవాకులు పేలితే.. ప్రజలు ఈ సారి పిచ్చి ఆస్పత్రికి పంపించడం ఖాయమని ఆమె ఎద్దేవా చేశారు.
టీడీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా మారి చేస్తున్న ట్వీటర్లను పరిశీస్తే చాలు అతని ఏ మాత్రం రాజకీయ అవగాహన ఉందో అర్థమవుతుందన్నారు. అతని రాతలను చూస్తే..నిజంగా పిచ్చోడి చేతిలో రాయి గుర్తు వస్తుందన్నారు. పిచ్చోడి చేతిలో రాయి .. గన్నేరు పప్పు ( మాజీ మంత్రి నారా లోకేష్ ) చేతిలో ట్విట్టర్ రెండు కూడా అత్యంత ప్రమాదకరమని ఇది ఆంధ్ర రాష్ట్రానికి హానికరం అని రెడ్డి మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనతికాలంలోనే అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్నారని చెప్పారు. ఆ విధంగా ప్రజారంజకమైన పాలన అందించడానికి వైయస్ జగన్ కృషి చేస్తున్నారని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలకు మేలు జరిగే విధంగా వ్యవహరించాల్సిన ప్రతిపక్ష పార్టీ దుష్ప్రచారానికి దిగడం శోచనీయమన్నారు. గతంలో ఎన్నో సందర్భాల్లో పప్పు బాబు తెలుగు మాట్లాడటం సరిగా నేర్చుకో అంటూ ఎన్నో సార్లు హితవు పలికానని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. అప్పుడే కనక తన సలహా పాటించి ఉంటే కనీసం ఎమ్మెల్యే గా అయినా గెలిచి ఉండేవాడు వాపోయారు.
లోకేష్ కి పదవులపైన ఉన్న వ్యామోహం.. రాజకీయ పరిజ్ఞానాన్ని, ప్రజల సమస్యల పరిష్కార అవగాహనను సంపాదించడం పైన లేదని విమర్శించారు.