నా చెల్లి రోజాను గెలిపించండి అని జగన్ అనగానే.. సునామీలా జనహోరు..!

Chakravarthi Kalyan
వైసీపీలో కీలక నేతల్లో నగరి ఎమ్మెల్యే రోజా ఒకరన్న సంగతి తెలిసిందే. జగన్ రోజా మధ్య అనుబంధం కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. రాఖీ రోజు రోజా జగన్‌కు రాఖీ కడుతుంటారు. అలాంటి రోజా కోసం జగన్ నగరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ  జగన్ చేసిన ప్రసంగం నగరి వాసులను ఆకట్టుకుంది. 


జగన్ ఏమన్నారంటే.. నా కుడివైపున రోజమ్మ ఉంది.. నాచెల్లెలు..సౌమ్యురాలు.. మంచిది.. మంచి చేస్తుందన్న నమ్మకం నాకు గుండెల నిండా ఉంది. మీ అందరి చల్లని దీవెనలు రోజా మీద ఉంచాలని కోరారు జగన్. జగన్ రోజా చేయిపట్టుకుని ప్రజలకు చూపిస్తూ.. నా చెల్లెలు రోజా అంటూ చెబుతుండగా... జనంలో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. 

హర్షాతిరేకాలతో నగరి ప్రజలు జయజయధ్వానాలు చేశారు. మన పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా రెడ్డన్న ఉన్నాడు. అన్ని రకాలుగా మంచి చేస్తాడన్న నమ్మకం నాకు ఉందన్నారు జగన్ . రెడ్డన్న మీద కూడా చల్లని దీవెనులు సంపూర్ణంగా మీరందరూ ఉంచాల్సిందిగా రెండు చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను అని జగన్ కోరారు. 

ప్రజలకు ఇచ్చిన హామీలు నవరత్నాలుకు కట్టుబడి ఉన్నానని, ఈ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రాగానే వాటిని కచ్చితంగా అమలు చేస్తానని జగన్ మరోసారి స్పష్టం చేశారు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలని, అందుకు అందరి దీవెనలు కావాలని తమ పార్టీని గెలిపించాలని కోరారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: