ఓ రేంజ్ లో చింతమనేనికి రిల్ వేసిన జగన్..!

KSK
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల వైసీపీ అధినేత జగన్ చిత్తూరు జిల్లాలో జరిగిన బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ నాయకులపై మరియు చంద్రబాబుపై వారి చేస్తున్న అవినీతిపై సంచలన కామెంట్ చేశారు.


ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ దెందులూరు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే చింతమనేని ప్రభాకర్ పై ఆయన నియోజకవర్గంలో చేసిన దాడులపై మరియు అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణాపై జగన్ మాట్లాడుతూ చంద్రబాబు పై చింతమనేని ప్రభాకర్ పై తీవ్ర విమర్శలు చేశారు.


అక్రమంగా ఇసుక రవాణా ను అడ్డుకున్న మహిళా ఎమ్మార్వో పై చేయి చేసుకున్న తన వర్గానికి చెందిన చింతమనేని ప్రభాకర్ కి మళ్ళి టికెట్ కేటాయించి రౌడీలను రాజకీయాలలో ప్రోత్సహిస్తున్నారని చింతమనేని ప్రభాకర్ ను ఉద్దేశించి జగన్ తీవ్ర విమర్శల వర్షం కురిపించారు.


ఇంత దారుణమైన చంద్రబాబు ప్రజలను మోసం చేయటం లో తన వర్గానికి చెందిన వారిని కాపాడటంలో న్యాయస్థానాలను సైతం మేనేజ్ చేస్తూ నీచమైన రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని చంద్రబాబుపై తీవ్ర విమర్శల వర్షం కురిపించారు జగన్.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: