తెలంగాణ ప్రజలు తమ ప్రభుత్వం పై ఎంతో నమ్మకం ఉండటం వల్లే మరోసారి ఎన్నుకున్నారని..అలాంటి నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ముచేయబోమిన వాగ్ధానం చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. నేడు ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ..ప్రజలకు మేలు చేయడమే మా లక్ష్యం అని..ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు సమాధానం ఇచ్చారు.
కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదని..ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయడమే మా లక్ష్యం అని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అద్భుతమైన పురోగతి ఉంది. కాంగ్రెస్ పాలనలో మైనర్ ఇరిగేషన్ ధ్వంసం అయ్యింది.
కాంగ్రెస్ నాయకులు అవాస్తవాలు మాట్లాడుతున్నారని అన్నారు. కేంద్రాన్ని నిధులు ఇవ్వాలని కోరినా పట్టించుకోవడం లేదని కేసీఆర్ అన్నారు. కాగా, తెలంగాణ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై ఇరుపక్షాల మద్య వాడీ వేడీ చర్చలు నడుస్తున్నాయి.