ఎన్నికల ముందు టీడీపీ కొంపముంచిన చంద్రబాబు నిర్ణయం..?
ఈ నేపథ్యంలో కొంత మంది టిడిపి ఎమ్మెల్యేలు చంద్రబాబు తీసుకున్న నిర్ణయం నచ్చకపోవడంతో వీడే ఆలోచనలో వున్నారట. ఇన్నాళ్లుగా చంద్రబాబు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానలను చూసీ చూడనట్టు పోయిన కొంత మంది ఎమ్మెల్యేలు బాబు తన జాబితాను ప్రకటించకముందే పార్టీని వీడాలని అప్పుడే స్కెచ్ వేశారని సమాచారం.
టీడీపీ నుంచి జనవరిలో 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు జనసేనతో పాటు వైసీపీలో చేరే అవకావం వుందని, ఇదే జరిగితే ఏపీలో చంద్రబాబుకు ఇక చుక్కలే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇప్పటికే ఎన్నికల ముందు తెలంగాణలో వచ్చిన వోటమి ఆంధ్రాలో ఎఫెక్ట్ చూపిస్తున్న క్రమంలో ఇప్పుడు ఇంత మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడితే కచ్చితంగా చంద్రబాబు కి భారీ ఎఫెక్ట్ ఉంటుందని పచ్చిగా చెప్పాలంటే అభ్యర్థులు కూడా రానున్న ఎన్నికల్లో దొరికే అవకాశం ఉండదని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.