అమలాపురం సభలో జగన్ పై విమర్శల వర్షం కురిపించిన పవన్..!
వైసీపీ అధినేత జగన్ జైలుకు వెళ్లిన అంశాన్ని ప్రస్తావిస్తూ..ప్రజల కోసమో, దేశం కోసమో నెల్సన్ మండేలా లా జగన్ జైలుకు వెళ్లలేదు. లక్ష కోట్లు దోచుకున్నాడు గనకే జైలుకు వెళ్లాడు. కొన్ని నెలలు శిక్ష అనుభవించాడు.
కోడికత్తి ఘటనపై ఫిర్యాదు చేయకుండా జగన్ గత కొన్ని రోజులుగా డ్రమాలు చేస్తున్నాడని, జగన్పై కోడికత్తి ఘటనకు పాల్పడింది జనసైనికులే అని టీడీపీ నేలబారు రాజకీయం చేసిందని దుయ్యబట్టారు. బ్లేడుతో గీత, కత్తితో గాటు పడితే మీలా డ్రామాలాడను మిమ్మల్నందర్నీ కాలగర్భంలో కలిపేస్తా అంటూ పవన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
వారసత్వ రాజకీయాలకు చెక్ పెట్టే రోజులు దగ్గరపడ్డాయని..తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీలపై తనదైన శైలిలో విమర్శలు చేశారు పవన్. అంతేకాకుండా రాజకీయాల్లోకి డబ్బు సంపాదించడానికి రాలేదని..చేగువేరా ని ఆదర్శంగా చేసుకుని ప్రజల కోసం పోరాడటానికి ప్రజా సమస్యలపై రాజకీయ నాయకులపై పోరాటం చేయడానికి పొలిటికల్ రంగంలో దిగానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నాడు.