వైసీపీ లో ఆ ఎంపీ చంద్ర బాబు కు చుక్కలు చూపిస్తున్నాడు కదా.. సంచలన వ్యాఖ్యలు..!

Prathap Kaluva

వైసీపి లో విజయసాయి రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు . జగన్ తరువాత పవర్ ఫుల్ లీడర్ ఎవరంటే ఇతనే అని చెప్పొచ్చు. అయితే చంద్ర బాబు సంచలన వ్యాఖ్యలు చేయడం లో ఎప్పడూ ముందుంటాడు. మొన్నే ఆదరణ పథకంపై విమర్శనాస్త్రాలు సంధించిన వైసీపీ ఎంపీ.. తాజాగా ఆశా వర్కర్ల సమావేశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పంచ్‌లు వేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో వీడియోను ట్వీట్ చేశారు.


ఆ వీడియోలో.. ‘ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకు దేశ భక్తుల గురించి చెబుతారు. అందరికి ఆదర్శవంతమైన శ్రీరామ రాజ్యం గురించి చెప్పి.. మాట తప్పిన వాడు మనిషి కాదని నూరిపోస్తారు. కాని చంద్రబాబు మాత్రం వెన్నుపోటు దారుల గురించి, రాజకీయ బ్రోకర్ల గురించి నూరిపోయాలని చెబుతున్నారని’ మండిపడ్డారు. మిమ్మల్ని చూసి పిల్లలకు జ్వరాలు వచ్చిన సంగతి మర్చిపోయారా. మీ సొంత మనవడు ఏడాది వరకు మీరు కనిపిస్తే గుక్క పెట్టి ఏడ్చేవారని ప్రజలు చెప్పుకుంటారు. నిజాయితీ అనే మాటకు వ్యతిరేకార్థం మీరు. అవకాశవాదానికి చిరునామా ఎవరా అంటే దేశం మొత్తం మీరేనంటోంది.


ఆంధ్ర ప్రజలకు పట్టిన శని మీరు. పిల్లల భవిష్యత్‌ను చిదిమేసిన పాపాన్ని మూటగట్టుకొన్న మీ గురించి ఉగ్గు పాలతో తల్లిదండ్రులు నూరిపోయాలా చంద్రబాబు’అని ప్రశ్నించారు. ‘చిన్న పిల్లలు పెద్దవారయ్యాక కూడా మీ తరాలకు ఓటేయాలా.. మరో తరం మీలాంటి మోసగాళ్లను భరించాలా.. తీవ్రమైన ఫ్రస్టేషన్‌లో చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. మీరు టీవీలో కనిపిస్తే చిన్నపిల్లల తల్లిదండ్రులు టీవీ మారుస్తారు. రావణుడు, నరకాసురుడు ఎవరని పిల్లలు అడిగితే.. తల్లిదండ్రులు టాపిక్ మారుస్తారు.. మీ చరిత్ర అంతే చంద్రబాబు’అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: