ఆపరేషన్ గరుడ లో తరువాయి భాగం..హీరో శివాజీ సంచలన కామెంట్స్ !
రాష్ట్రంలో తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర జరుగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు జగన్ పై దాడి జరిగిన సమయంలో అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ గరుడ వివరించిన సినీ నటుడు శివాజీ..జగన్ పై దాడి జరిగిన తర్వాత మొట్టమొదటి సారిగా ఓ టీవీ చానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీని కూల్చడానికి ఒక కొత్త నాయకుడు..స్కెచ్ వేశారని అయితే అది ఫెయిల్ అయిందని తెలిపారు. జాతీయ పార్టీతో కలిసి పొరుగురాష్ట్రంలో రేవంత్ రెడ్డిని ఇరికించినట్టే ఇరికిద్దామనుకుని ఓ కొత్త నాయకుడు ప్లాన్ వేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
అయితే అదికాస్త ఫెయిల్ అయ్యిందని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని పడేయాలని చూశారన్నారు. త్వరలో ఆ కుట్ర బయటపెడతానని స్పష్టం చేశారు. అయితే ఆ కొత్త నాయకుడు ఎవరో అన్న విషయం గురించి స్పష్టత ఇవ్వలేదు శివాజీ.