పవన్ కళ్యాణ్ గడ్డం పై అదిరిపోయే సెటైర్ వేసిన కేటీఆర్..!

KSK
తెలంగాణ రాష్ట్రంలో మరి కొద్ది రోజులలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్ తన పార్టీ తరఫున ప్రచార పర్వంలో దూసుకెళ్ళిపోతున్నరు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కోట మీద ఏర్పడిన రాజకీయ పార్టీలపై ఆ పార్టీ అధినేత లపై మరియు నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు కేటీఆర్.


ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావిస్తూ ప్రత్యర్థులపై సెటైర్లు వేశారు కేటీఆర్...కార్యకర్తలతో మాట్లాడుతూ ‘గడ్డం పెంచిన ప్రతివోడూ గబ్బర్ సింగ్ అయితడా?’ పవన్ కళ్యాణ్ అయితడా?’’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించే ఈ సెటైర్ వేసిన పేరు ప్రస్తావించకుండా కేటీఆర్ బీభత్సమైన పంచ్ పడేలాగా అద్భుత రీతిలో రాజకీయంగా సామాన్యులకు అర్థమయ్యే రీతిలో కేటీఆర్ వ్యాఖ్యానించారు.


ఎన్నికలు దగ్గరకొస్తున్న కొలది టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో ఉండటంతో ఒక పక్క కేటీఆర్ తన తండ్రి కేసిఆర్ వల్లే ఛలోక్తులు కామెంట్స్ చేస్తూ వచ్చే ఎన్నికలలో కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తూనరు.


ఇదే క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కెసిఆర్ కేటీఆర్ పై ఓ రేంజులో విరుచుకు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ని మోసం చేసి బంగారు తెలంగాణ అంటూ ప్రజలను మోసం చేసి...జరగాల్సిన అసెంబ్లీని రద్దు చేసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ సర్కార్ కు రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని కామెంట్ చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: