బెల్టు షాపులు క్లోజ్ ఐతే….బాబు ఖజానా క్లోజ్ అయిపోయినట్టే: ఉండవల్లి అరుణ్ కుమార్

KSK
చంద్రబాబు పాలన పై సంచలన కామెంట్ చేశారు ఉండవల్లి అరుణ్ కుమార్. రాష్ట్రంలో మద్యం తాగేవారు ఒక వారం రోజులపాటు ధర్నా చేస్తే చంద్రబాబు ప్రభుత్వం షేక్ అవుతుందని అన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని...తాగుబోతుల పై చంద్రబాబు చాలా సంపాదిస్తున్నారని పేర్కొన్నారు.


కేవలం రూ .8.50కి తయారయ్యే మద్యంను రూ. 50కి అమ్ముతున్నారని, దీంట్లో 37 రూపాయలు ప్రభుత్వం దోచేస్తుందన్నారు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి మరి ఏ రాష్ట్రంలో జరగడం లేదని అన్నారు. ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేని వడ్డీలు చంద్రబాబు ప్రభుత్వం వసూలు చేస్తున్నారు.


జలయజ్ఞంలో ఇచ్చిన కేటాయింపులు ఏంటని ప్రశ్నించారు కేవలం నాలుగేళ్లలో లక్షా 30వేలకోట్లు అప్పు చేశారని, ఇంత అప్పు చేసి దేనికి ఖర్చు చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీఎం చంద్రబాబు నిజం చెప్పి పరిపాలన చేయగలరా అని ప్రశ్నించారు. ‎


బాబు చెప్పిన వ్యాపార లెక్కలను స్విట్జర్లాండ్‌ ఆర్థికవేత్త వ్యతిరేకించారని, ఆయన లెక్కలు చెబితే జైళ్లో పెడతారని చెప్పినట్లు ఉండవల్లి పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజాధనాన్ని ఇష్టం వచ్చిన రీతిలో ఖర్చు పెట్టేస్తున్నారు అని సంచలన కామెంట్ చేసారు ఉండవల్లి. గడిచిన తొమ్మిది నెలల్లో చంద్రబాబు చేసిన ఖర్చు గురించి బయట పెడితే ప్రజలు వచ్చే ఎన్నికల్లో టిడిపికి ఓటు వేయాలని పేర్కొన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: