బాబుకు షాక్... భూ దోపిడీపై పవన్ యుధ్ధం

Satya
ప్రజా పోరాట యాత్ర మాటేమో కానీ, చంద్రబాబుతో పవన్ చెడుగుడు ఆడేస్తున్నాడు. బాబే నా టార్గెట్ అంటూ రెచ్చిపోతున్నాడు. వచ్చే ఎన్నికలలో సీఎం సీటు నుంచి దించేస్తానంటూ చాలెంజ్ కూడా చేస్తున్నాడు. నాలుగేళ్ళ పాలనలో బాబు అన్నింటా ఫెయిల్ అయ్యారని ఊరూ వాడా చాటుతున్న జనసేనాని బాబు భూ భాగోతంపై లేటెస్ట్ గా యుధ్ధాన్ని ప్రకటించేశాడు. అమరావతి మొదలుకుని, శ్రీకాకుళం వరకూ టీడీపీ భూ దందా పైనే నా పోరాటం అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. 


అపుడే చెప్పా :


రాజధాని కోసం వేలాది ఎకరాల పంట భూములను భూములను అవసరానికి మించి తీసుకోవద్దని మిత్రునిగా ఆనాడే చెప్పానని పవన్ అంటున్నారు. మాట వినని బాబు అమాయక రైతులను నడి రోడ్డున పడేశారని ఫైర్ అయ్యారు.  పేరుకు అభివ్రుధ్ధి, దాని వెనక ఉన్నది అచ్చమైన భూ దాహం, ఇకపై ఇది సాగనివ్వమంటూ పవన్ గర్జిస్తున్నారు. భూ బాధితులంతా జేఏసీ గా ఏర్పడితే తాను ముందుండి కధ నడిపిస్తానని, భూములు దిగమింగిన వాళ్ళ భరతం పడతానంటూ గట్టి వార్నింగులే ఇచ్చారు.


అంతా కక్కిస్తా :


ఎక్కడైతే అభివ్రుధ్ధి పేరు చెప్పి వందలు, వేల ఎకరాల భూములను అప్పనంగా కొట్టేస్తున్నారో ఆ భూములన్ని కక్కిస్తామంటూ జనసేనాని అంటున్నారు. భూములన్ని మీ అస్మదీయులకు రైతులు, పేదలు రోడ్డు మీదకా అంటూ ఓ రేంజిలో  ఫైర్ అయ్యారు. 2013 భూసేకరణ చట్టానికి కూడా తూట్లు పొడిచేసి మీకు నచ్చినట్లుగా సవరణలు తెచ్చుకుంటారా, గ్రామాలను మింగే రోడ్లు మాకు వద్ధని, ఆ ప్రగతీ అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.  అమరావతి నుంచే భూ సమరం అంటూ ప్రకటించేశాడు.  మొత్తానికి చూడబోతే పవన్ బాబుని బాగానే ఇరికించాలని చూస్తున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: