జేసీ మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు... అన్ని నిరూపిస్తా...!

Prathap Kaluva

జేసీ దివాకర్ రెడ్డి ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాను చెప్పాల్సిన మాటలు ముక్కు సూటిగా చెబుతాడు. అయితే మహానాడు వేదిక గా జేసీ జగన్ మీద చేసిన వ్యాఖలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే దానికి నిరసనగా వైసీపీ శ్రేణులు జేసీ దిష్టి బొమ్మను దగ్ధం చేసినారు. శవ యాత్ర చేసినారు అయితే దీనికి స్పందనగా జేసి ఎవరైనా తమ తండ్రులకు కొడుకులు శవ యాత్ర చేస్తారని నాకు ఇంతమంది కొడుకులు ఉన్నారా అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినాడు. 


జగన్ పైన తాను చేసిన ప్రతి మాటను నిరూపించేందుకు అవసరమైతే ఆయన సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్లేందుకు కూడా సిద్ధమని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఇటీవల తన వ్యాఖ్యలకు నిరసనగా పలువురు దిష్టిబొమ్మ శవయాత్ర, దహనం వంటివి చేపడుతున్నారని, మన సంప్రదాయం ప్రకారం ఇలాంటి వాటిని తండ్రికి కొడుకులు చేస్తారన్నారు. తనకు ఇంతమంది కుమారులు ఎక్కడి నుంచి వచ్చారో తెలియడం లేదన్నారు.


ఈయన వ్యాఖ్యలపై వైసీపీ వర్గాలు మరోసారి మండిపడ్డాయి. శవయాత్ర నిర్వహిస్తే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అని మండిపడ్డారు. ఉత్తరాదిన కాశ్మీర్‌ నుంచి దక్షిణాదిన ఉన్న కర్ణాటక, తెలంగాణలో వారసత్వ రాజకీయాలున్నాయని, ఏపీ సీఎం చంద్రబాబూ తన కుమారుడు లోకేష్‌కు పట్టాభిషేకం చేయాలనుకోవడం సహజమేనని జేసీ అన్నారు. అయితే ఆ విషయాన్ని ఆయన బయటకు వ్యక్తం చేయడం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నంత కాలం రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: