చంద్రబాబుకి ఊహించని విధంగా వార్నింగ్ ఇచ్చిన పవన్ !

KSK
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రజాపోరాట యాత్ర పేరుతో ప్రజల మధ్య తిరుగుతున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఆయన తనయుడు మంత్రి లోకేష్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇటీవల శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి మొదలుపెట్టిన బస్సు యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దోపిడీపై విరుచుకుపడ్డారు.

ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ప్రజలను బానిసలుగా చూసే నాయకులు పరిపాలిస్తున్నారు అని పేర్కొన్నాడు. అంతేకాకుండా గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి చాలా తప్పు చేశాడని అన్నారు. అనుభవం ఉంది కదా అని చంద్రబాబుకు మద్దతు తెలిపితే చంద్రబాబు అధికారంలోకి వచ్చి అవినీతికి తెగపడ్డారని అన్నారు.

ఆనాడు ఎన్నికల సమయంలో చంద్రబాబు అనేక అబద్ధపు హామీలిచ్చి ప్రజలను అడ్డంగా మోసం చేశారని అన్నారు. అయితే ఆ సమయంలో అనుభవం ఉంది కదా చంద్రబాబు ఇవన్నీ చేస్తాడు అని నేను కూడా మీలాగే నమ్మాను అని అన్నాడు..అయితే ఇప్పుడు తెలిసింది చంద్రబాబు చేసింది మోసమని అన్నారు. అయితే అధికారంలోకి వచ్చి చంద్రబాబు మాత్రమే కాకుండా కొడుకు నారా లోకేష్ చేత కూడా రాష్ట్ర ప్రజలను మోసం చేపించాడని ఆగ్రహం చెందాడు.

అయితే చంద్రబాబు గత ఎన్నికలలో మద్దతు తెలిపిన జనసేన పార్టీ పట్ల అధికారంలోకి వచ్చాక చాలా విచిత్రంగా ప్రవర్తించారని కుక్క కన్నా హీనంగా జనసేన పార్టీ పై వ్యవహరించారని అన్నారు. వచ్చే ఎన్నికలలో ఈసారి 2014 లాగా ఉండదని 2019 ఎన్నికలు చంద్రబాబుకి చుక్కలు చూపించే విధంగా ఉంటాయని హెచ్చరించారు పవన్.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: