కర్ణాటక ఎన్నికలు... టీడీపీ గుండెల్లో రైళ్లు...!
అవును కర్ణాటక ఎన్నికల ఫలితాలు గురించి టీడీపీ లో టెన్షన్ మొదలైంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయంగా చాలా మార్పులు వస్తాయాని బహిరంగంగానే బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనితో టీడీపీ పార్టీలో ఒక రక మైన వాతారణం మొదలైంది. అస్సలు కర్ణాటకలో బీజేపీ ఓడిపోతే తమ పరిస్థితి ఏంటి అని చాలా మంది టీడీపీ లో మల్ల గుల్లాలు పడుతున్నారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ కి వ్యతిరేకంగా టీడీపీ మంత్రులు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.
ఎటూ కేంద్రంతోను బిజెపితోను చెడింది కాబట్టి టిడిపి నేతలు రెచ్చిపోయారు. వెంటనే కర్నాటకలో వాలిపోయి బిజెపి, మోడిపై తమకున్న అక్కసంతా తీర్చుకున్నారు. కొందరు మంత్రులేమో బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే మరికొందరు మంత్రులు కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రచారం చేశారు. మొత్తం మీద బిజెపికి మాత్రం తెలుగువాళ్ళు ఓట్లేయద్దంటూ బహిరంగంగానే మంత్రులు, నేతలంతా కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేశారు.
ఒకవేళ బిజెపి నిజంగానే ఓడిపోతే పరిస్ధితేంటి ? అన్న విషయంపై తాజాగా టిడిపిలో చర్చ మొదలైంది. బిజెపిలో ఓడిపోతే కర్నాటకలో బిజెపికి ఏమీ కాదు. అయితే, దాని ప్రభావం ఏపిలో టిడిపిపై ఏ విధంగా ఉండబోతోందో అన్న ఆందోళన కొందరు నేతల్లో కనబడుతోంది. పలు సందర్భాల్లో మోడి, కేంద్రంపై యుద్దం ప్రకటించినట్లు చంద్రబాబు చెప్పిన విషయాన్ని నేతలు గుర్తు చేసుకుంటున్నారు. కర్నాటకలో ఓడిపోయిన బిజెపి ఆ అక్కసంతా ఏపిలోని తమపై చూపిస్తుందేమో అన్న ఆందోళనలో టిడిపి నేతల్లో పెరిగిపోతోంది.