పోలీస్ స్టేషన్ లో శ్రీరెడ్డి కేసు పెట్టింది..ఎవరిపైనో తెలుసా!
అంతకు ముందు ‘మా ’ అసోసియేషన్ వారు తనకు కార్డు ఇవ్వలేదని ఫిలిమ్ ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేయడంతో అది కాస్త నేషనల్ మీడియాలో దుమ్మురేపడతో ‘మా’ అసోసియేషన్ ఓ మెట్టు దిగి శ్రీశక్తి అన్ని రకాలుగా న్యాయం చేస్తామని..తానకు కావాల్సింది ఇస్తామని చెప్పారు. శ్రీరెడ్డి విషయం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్ ముందు ప్రస్తావించగా ఇలాంటి వాటి విషయంలో ఎమోషనల్ కన్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందని..తమకు అన్యాయం జరిగితే చట్టపరంగా వెళ్లాలని సూచించారు. ఈ నేపథ్యంలో శ్రీశక్తి పోలీస్ మెట్టు ఎక్కింది.
అయితే తన జీవితాన్ని నాశనం చేశారని ఆరోపిస్తున్న వ్యక్తులపై కాకుండా తనపై అభ్యంతరకరమైన వ్యాఖ్యాలు చేసిన వారిపై కేసు పెట్టడమే విచిత్రం.. వివరాల్లోకి వెళితే.. కరాటె కళ్యాణి.. సత్య చౌదరిల తనపై అభ్యంతరకర వ్యాఖ్యాలు చేస్తున్నారంటూ, వారిపై శ్రీరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
హుమయూన్ నగర్ పోలీస్ స్టేషన్ కు స్వయంగా వెళ్లిన ఆమె తన ఫిర్యాదును స్టేషన్ హౌజ్ ఆఫీసర్ కు అందజేసింది. అంతే కాదు దానికి సంబంధించిన ఆధారాలు కూడా అందులో పొందు పరిచినట్లు సమాచారం. మరి ఈ విషయంపై టాలీవుడ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.