జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉన్నవాళ్లకు గుడ్ న్యూస్.. ఏకంగా ఇన్ని లాభాలా?
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ (BSBDA)దారులకు తీపి కబురు అందించింది. 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధనలు దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. ఈ నిర్ణయం జీరో బ్యాలన్స్ ఖాతాదారులతో పాటు కొత్తగా ఖాతా తెరవాలనుకునే వారికి సైతం అసాధారణ స్థాయిలో ప్రయోజనాలను అందించనుంది.
కొత్త నిబంధనల ప్రకారం, BSBDA ఖాతాదారులకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ (లావాదేవీలపై) ఎటువంటి పరిమితి ఉండదు. దీంతో పాటు, డిపాజిట్లపై ఎటువంటి ఫీజు లేకుండా అన్లిమిటెడ్ డిపాజిట్ సౌకర్యం అమలులోకి రానుంది. ఇది సాధారణ ప్రజలకు పెద్ద ఉపశమనం కలిగించే అంశం.
మరో ముఖ్యమైన మార్పు ఏమిటంటే, ఈ ఖాతాదారులకు ఇకపై వార్షిక ఫీజు లేకుండా ఏటీఎం (ATM) కార్డు మంజూరు అవుతుంది. ముఖ్యంగా, ప్రతి నెలా ఉచితంగా 4 ఏటీఎం విత్డ్రాలు (డబ్బు ఉపసంహరణలు) లభిస్తాయి. ఈ నాలుగు విత్డ్రాలలో ఏటీఎం ద్వారా నగదు ఉపసంహరణతో పాటు ఇతర బ్యాంకింగ్ లావాదేవీలు కూడా కలిసి ఉంటాయి.
అదనంగా, ఖాతాదారులు ఏడాదికి 25 చెక్ లీఫ్స్ను ఉచితంగా పొందవచ్చు. అలాగే, పాస్ బుక్ మరియు అకౌంట్ స్టేట్మెంట్స్ను కూడా ఎటువంటి ఛార్జీ లేకుండా పొందే అవకాశం ఉంటుంది. ఈ నిబంధనలు నిరుపేదలు మరియు తక్కువ ఆదాయ వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని, వారి ప్రాథమిక బ్యాంకింగ్ అవసరాలను తీర్చడానికి RBI తీసుకున్న సాహసోపేతమైన మరియు విప్లవాత్మక నిర్ణయంగా చెప్పవచ్చు. ఈ మార్పుల వల్ల సాధారణ ప్రజలు బ్యాంకింగ్ సేవలను మరింత సులభంగా మరియు ఉచితంగా వినియోగించుకోవడానికి వీలవుతుంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు