గ్రూప్1లో మరో గోల్ మాల్.. ఒకే హాల్ టికెట్.. ఇద్దరు విజేతలు?
టీజీపీఎస్సీ ప్రకటన ప్రకారం, నిశ్రిత సమర్పించిన హాల్టికెట్ నకిలీదని, ఆమె వాదనలు అవాస్తవమని స్పష్టం చేసింది. ఇద్దరికి ఒకే హాల్ టికెట్ జారీ అయ్యిందన్న వాదనలను కొట్టిపారేసింది. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అభ్యర్థులు ఇటువంటి వదంతులను నమ్మవద్దని సూచించింది.ఈ ఘటన గ్రూప్-1 ఎంపిక ప్రక్రియలోని లోపాలను బయటపెట్టింది. ఇంతటి ప్రాధాన్యత గల పోస్టుల ఎంపికలో జాగ్రత్తలు తీసు కోవాల్సిన అవసరం ఉంది.
అయితే, ఈ వ్యవహారంలో పలు సందేహాలు తలెత్తుతున్నాయి. నియామక ప్రక్రియలో శాఖల అధికారులు నిబంధనలను పాటించడం లేదని, ప్రక్రియలో లోపాలున్నాయని నిరుద్యోగులు, జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రిక్రూట్మెంట్ సంస్థలు ఎంపికైన అభ్యర్థుల వివరాలను సంబంధిత శాఖలకు పంపి, నియామక పత్రాలు జారీ చేయాలి. కానీ, ఈ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నట్లు తాజా ఉదంతం సూచిస్తోంది. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగ కుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు