
ఏపీ: పవన్ కళ్యాణ్ ను ఆడేసుకుంటున్న సీపీఐ పార్టీ నాయకులు..!
అయితే ప్రస్తుతం బిజెపి పార్టీతో పోతూ ఉండడంతో సనాతన ధర్మం అంటూ వ్యవహరిస్తున్నారు.. గతంలో కహిందీ రుద్దడాన్ని పవన్ కళ్యాణ్ వక్రీకరించారని అయితే ఇప్పుడు మళ్లీ త్రిభాష సూత్రాలని గౌరవించాలంటూ మాట్లాడుతున్నారంటూ చెబుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఫైర్ అవుతున్నారు. సనాతన ధర్మాన్ని ఉద్ధరించాలని.. కాషాయం దుస్తులు వేసుకొని మరి పవన్ కళ్యాణ్ తిరుగుతున్నారని పవన్ కళ్యాణ్ కు పంచాయతీరాజ్ కంటే దేవాదాయ శాఖ ఇస్తేనే మంచిదంటూ ఎద్దేవా చేశారు. తన పరిపాలన గాలికి వదిలేసి కాషాయ దుస్తులతో తిరుగుతున్నాడు అంట ఫైర్ అయ్యారు.
అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పిచ్చాసుపత్రిలోకి జేర్పించాలని సలహాను కూడా ఇవ్వడం జరిగింది.. రోజుకొక మాట మాట్లాడుతూ ఉన్న పవన్ కళ్యాణ్ సెట్ కావాలి అంటే అంతకంటే మరొక మార్గం లేదంటే కూడా తెలియజేశారు నారాయణ. పవన్ కళ్యాణ్ ఒకసారి చేగువేరా అంటారు మరొకసారి సనాతన ధర్మం అంటూ ఏవేవో అంటూ ఉంటారని ఎద్దేవ చేశారు.. సనాతన ధర్మంలో భర్త మరణిస్తే భార్య చితిమంటల్లో ఆహుతి అవుతుంది.. ఇలాంటి ధర్మాన్ని పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటారా.. మూడు పెళ్లిళ్ల పవన్ కళ్యాణ్ అంటూ సిపిఐ నారాయణ హేలన చేయడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలు జనసేన నేతలును తీవ్ర ఆగ్రహానికి గురయ్యాలా చేస్తోంది. మీలాంటి సీనియర్ నేతలు ఇలా మాట్లాడకూడదంటూ ఫైర్ అవుతున్నారు.