చంద్రబాబు మ్యాజిక్..! మూడు రోజుల్లో మద్యం ద్వారా ఎంత ఆదాయం వచ్చిందో అంటే..?

Chakravarthi Kalyan
మందు తాగని వాడు ఏమై పుడతాడో మహాకవి గురజాడ అప్పారావు గారు ఎక్కడా చెప్పలేదు.  ఆయన పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్ అని చెప్పి వదిలేశారు. సో మందు విషయంలో ఎవరి చాయిస్ వారికి ఇచ్చేశారు అన్న మాట.  అయినా సరే పోగతాగని వాడే దున్నపోతై పుడితే మందు తాగని వాడు ఇంకా ఎలా పుడతారో అన్న కంగారూ భయాలు ఉంటాయి కదా.  


తాము అధికారంలోకి వస్తే నాణ్యమైన మందుని ఇస్తామని విపక్షాలు  ప్రామిస్ కూడా చేశాయి. ఇపుడు ఇస్తున్నాయి.  ఈ నెల 16 నుంచి ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ రూపంలో తెరచుకున్న మందు షాపులు మహా కిక్కే ఇస్తున్నాయి. అవి లక్ష్మీ కళతో ఉట్టిపడుస్తున్నాయి.  మరి మద్యం ద్వారా ఆదాయం ఎలా వస్తోంది. అమ్మకాలు ఎలా సాగుతున్నాయన్న ఆసక్తి ఉంటుంది. మూడు రోజుల వ్యవధిలో జరిగిన మద్యం అమ్మకాలు ఏపీవ్యాప్తంగా చూసుకుంటే కనుక అక్షరాలా రూ. 541 కోట్ల రూపాయలు జరిగాయని లెక్కలు చెబుతున్నాయి.


సగటున రోజుకు నూటాభై నుంచి రెండు వందల కోట్ల దాకా మద్యం అమ్మకాలు జరిగాయన్న మాట.  దసరా పండుగ వెళ్లిపోయింది అయినా కొత్త సరదా పండుగగా మారి మద్యం దుకాణాలకు కాసుల పంట కురిపిస్తోంది అని అంటున్నారు.  ఇక కేవలం మూడు రోజుల వ్యవధిలో 7,843 మంది మద్యం వ్యాపారులు స్టాక్ ని తీసుకుని వెళ్ళారు అని అంటున్నారు.  స్టాక్ అయిపోయింది అని ఒక్కసారి కాదు రెండు మూడు సార్లు తీసుకెళ్ళిన వ్యాపారులూ ఉన్నారు అంటే కనుక ఏ విధంగా మద్యం సేల్ అవుతుందో ఊహించుకోండి అనే అంటున్నారు.


ఇక కొత్త లిక్కర్ పాలసీని అమలు చేసిన తరువాత చూస్తే కనుక ఇప్పటి వరకూ 6 లక్షల 77 వేల 511 కేసుల లిక్కర్ అమ్ముడైందని ఎక్సైజ్ శాఖ అధికార వర్గాల లెక్కలు చెబుతున్నాయి. అంతే కాదు ఇందులో చూస్తే కనుక ఒక లక్షా 94 వేల 261 కేసుల బీర్లు అమ్మడయ్యాయని చెబుతున్నారు.   ఇదే తీరున మద్యం ఊపు కొనసాగితే ఏపీకి కాసుల పంటే అని చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: