ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు పవన్ వార్నింగ్.. ఆ కామెంట్ల వెనుక అసలు అర్థం ఇదే!

Reddy P Rajasekhar
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసే ప్రతి కామెంట్ వెనుక అంతరార్థం ఉంటుందని చాలామంది భావిస్తారు. పవన్ కళ్యాణ్ తాజాగా ఒక సందర్భంలో మాట్లాడుతూ తాను అవినీతి అన్నది సహించనని కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. అవినీతి చేయాలనే ఆలోచన ఉన్నవాళ్లు ఉంటే వెళ్లిపోవచ్చని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
 
అయితే పవన్ కళ్యాణ్ ఇలా వార్నింగ్ ఇవ్వడం వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయని తెలుస్తోంది. ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ ఈ వార్నింగ్ ఇచ్చారని సమాచారం అందుతోంది. ఉమ్మడి విశాఖకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అనవసర విషయాలలో జోక్యం చేసుకోవడంతో పాటు పారిశ్రామిక వేత్తల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వాళ్లకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
 
పవన్ కళ్యాణ్ వార్నింగ్ తో అయినా వాళ్లలో మార్పు వస్తుందేమో చూడాలి. తర్వాత రోజుల్లో కూడా ఈ నేతల తీరు మారకపోతే ఈ నేతల విషయంలో పవర్ చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ సినిమాలు, రాజకీయాలలో సక్సెస్ సాధిస్తూ అభిమానుల మెప్పు పొందుతుండటం గమనార్హం. పవన్ చేసిన కామెంట్ల గురించి విశాఖ జిల్లా రాజకీయ నేతల మధ్య పవన్ కామెంట్ల గురించి చర్చ జరుగుతోంది.
 
పవన్ కళ్యాణ్ కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుండగా పవన్ సినిమాలకు దూరంగా ఉన్నారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ భారీ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే పవన్ మనస్సులో ఏముందనే ప్రశ్నకు జవాబు దొరకాల్సి ఉంది. పవన్ డిమాండ్ చేస్తే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ ఇవ్వడానికి సైతం నిర్మాతలు సిద్ధంగా ఉన్నారనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కెరీర్ ప్లాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: