తప్పుచేసి క్షమాపణలు.. స్క్రిప్ట్ ప్రకారమే కొండా సురేఖ వెళ్తోందా.?

Pandrala Sravanthi
- సినిమాలకు ట్రాన్స్ఫర్ తెలంగాణ పాలిటిక్స్..
- రాజకీయాల్లోకి హీరోయిన్స్ ను లాగుతున్న వైనం..
- కొండా సురేఖ మాటల్లో నిజమేంతా?

 తాజాగా సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో ఎక్కడ చూసినా కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ గురించే వినిపిస్తోంది. ఆమె చేసిన కామెంట్స్ పై ఓవైపు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సినీ ఇండస్ట్రీలో కూడా తీవ్రమైన చర్చ సాగుతోంది. ఆమె తెలిసి చేసిందా తెలియక చేసిందా లేదంటే స్క్రిప్ట్ ప్రకారమే ఈ కామెంట్స్ చేసిందో తెలియదు కానీ దానికి ఆమె మాట్లాడిన మాటలు తీవ్రమైన వివాదానికి దారితీసాయి. సినీ ఇండస్ట్రీలోని వ్యక్తుల కుటుంబ వ్యవహారాల గురించి ఆమె రాజకీయాల్లోకి తీసుకువచ్చి మాట్లాడడం మరింత దారుణమైన విషయం. మరి కొండా సురేఖ స్క్రిప్ట్ ప్రకారమే ఇలా చేస్తుందా.. లేదంటే ఆమె చేసిన మాటల్లో నిజం ఉందా.. నిజం ఉంటే మళ్లీ క్షమాపణలు ఎందుకు కోరింది.. ఆ వివరాలు ఏంటో చూద్దాం..
 కొండా సురేఖ మాటల్లో నిజమెంతా?

 మంత్రి కొండా సురేఖ ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉంది.  అలాంటి ఆమె బాధ్యత రహితమైనటువంటి మాటలు నిరాధారమైనటువంటి మాటలు మాట్లాడడం చాలా దారుణమని ఎంతోమంది సినీ ప్రముఖులు విమర్శిస్తున్నారు. అయితే కొండా సురేఖ నాగార్జున మాజీ కోడలు సమంతా పై దారుణమైన కామెంట్స్ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కు సంబంధించి కూల్చివేత పై నోటీసులు పంపారట. అయితే ఈ కూల్చివేతను ఆపాలి అంటే  కేటీఆర్ దగ్గరికి సమంతాను పంపాలని  నాగార్జునకు రాయబారం పంపారట. దీంతో నాగార్జున నాగచైతన్య కలిసి సమంతాను కేటీఆర్ దగ్గరికి పంపడానికి ఒప్పుకున్నట్టు, ఈ విషయం సమంతా కి చెబితే ఆమె నిరాకరించి వారితో గొడవ పడిందని  దీనివల్లే నాగచైతన్యకు సమంతకు విడాకులు అయ్యాయని మంత్రి కొండా సురేఖ కామెంట్లు చేసింది.  అంతేకాకుండా చాలామంది ప్రముఖుల హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి కేటీఆర్ లైంగికంగా వేధించారని కూడా మాటలు మాట్లాడింది.

 ఇలా సురేఖ ఎప్పుడైతే మాట్లాడిందో అప్పటినుంచి సినీ ఇండస్ట్రీ నుంచి ప్రముఖులంతా స్పందించి ఆమెపై దారుణమైన కామెంట్లు చేశారు. మీ రాజకీయ అవసరాల కోసం ఇలా ఏది పడితే అది మాట్లాడతారా అని అన్నారు. దీనిపై వెంటనే వెంటనే స్పందించినటువంటి కొండా సురేఖ మళ్ళీ క్షమాపణలు కోరింది. అయితే ఈ తతంగమంతా ఒక స్క్రిప్ట్ ప్రకారమే నడిచిందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో హైడ్రా, 6 గ్యారంటీలకు సంబంధించి తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది.  ఈ వ్యతిరేకతల నుంచి బయటపడాలి అంటే ప్రజల మనసులను మరో దిక్కు మళ్ళించాలి. దీనికోసమే కొండా సురేఖ ఈ విధమైన కామెంట్లు చేసిందని, ఈ వ్యవహారం తెరపైకి వచ్చి హైడ్రా వ్యతిరేకత అనేది వెనక్కి వచ్చిందని, ప్రస్తుతం ఈ వ్యవహారం గురించే ప్రజల్లో చర్చ జరుగుతోందని, ప్రభుత్వం చేసే తప్పులను పక్కకు తప్పించడానికి ఇలాంటి వ్యవహారాలను స్క్రిప్ట్ ప్రకారం మంత్రిత్వ చేయించారని ఒక టాక్ వినిపిస్తోంది.  ఒకవేళ స్క్రిప్ట్ ప్రకారం కాకుంటే మంత్రి కొండా సురేఖ మాట్లాడిన దాంట్లో ఉన్న నిజ నిజాలు బయట పెట్టాలి. లేదంటే ఇది కావాలనే చేసిన విషయంగా భావించబడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: