ఏపీ సిఎం: మంత్రులను భయపెట్టేలా నిర్ణయం..!

Divya
ఏపీ సీఎం చంద్రబాబు ఈ వయసులో కూడా అమరావతిలో వర్షాల కారణంగా వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉండడంతో అక్కడికి వెళ్లి మరి పరిస్థితులను పరిశీలిస్తూ ఉన్నారు. దాదాపుగా నాలుగు సార్లు సీఎంగా చంద్రబాబు ఎన్నికయ్యారు . ఇంతటి సీనియారిటీతో తెలుసుకున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన ఈయన ఒక కార్యకర్త మనసు ఎలా ఉంటుందో బాగా తెలుసు అందుకే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా ఏపీ సీఎం చంద్రబాబుకు తెలుసు. అలాగే ఏ మంత్రి ఎలా వ్యవహరిస్తున్నారు ఎవరు పని చేస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా చంద్రబాబు ఇట్టే పసిగట్టగలరు.


ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న పనిని మంత్రులు అధికారులు అందుకుంటున్నారా లేదా అనే చర్చ ఇప్పుడు కూటమిలో జరుగుతోందట. వాస్తవానికి చూస్తే చంద్రబాబు 10 అడుగులు వేస్తే ఆయనతోపాటు అడుగులు వేసేవారు ఎవరు లేరు అన్నట్లుగా చర్చలు జరుగుతున్నాయి. అని చంద్రబాబు చెప్పినట్లుగా మంత్రులు అధికారులు పనిచేస్తే సక్సెస్ అవుతాం అనుకున్నప్పటికీ కూడా.. చాలామంది సీఎం చంద్రబాబు చెప్పిన డైరెక్షన్ని కానీ దిశా నిర్దేశాలను కానీ ఎవరు పాటించడం లేదని అదే ఇప్పుడు కూటమిలో చర్చగా మారుతోంది.

ఈ విషయం అటు చంద్రబాబుకు చాలా కోపాన్ని తీసుకువచ్చేలా తెలుస్తుందట. తనతో పాటు అంతా కలిసి ఒక టీముగా సాగితేనే రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయని ఈ విషయాన్ని ఒకటికి పది సార్లు చెబుతూ ఉన్న అటు అధికారులు నేతలు ఎవరూ కూడా పట్టించుకోలేదని దీంతో వీరిని క్షమించేది లేదంటూ కూడా హెచ్చరిస్తున్నారట.. తన అడుగుజాడల్లో నడవలేని మంత్రులను అధికారులను తనకు అక్కరులేదని చంద్రబాబు డైరెక్టుగా చెప్పేసినట్లు కూటమి లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాంటి వారిని తీసేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారట ఏపీ సీఎం. ఇలా హెచ్చరించారో లేదో కొన్నిచోట్ల మాత్రమే మంత్రులు అధికారులు పనిచేస్తున్నారట. మరి చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం ఎంతమందికి మేలు చేస్తుందొ చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: