బాబు గ్రేట్ .. ప్రతిపక్షం చేతే పొగిడించుకుంటున్న ఏపీ సీఎం.!

Chakravarthi Kalyan

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తుపాన్ అనంతరం వరదల్లో చిక్కుకున్న వారి విషయంలో చేపడుతున్న రెస్క్యూ ఆపరేషన్ ని పొరుగు ప్రతిపక్షం మెచ్చుకుంటుంది. ఏపీలో అయితే వైసీపీ చంద్రబాబు ఏమీ చేయడం లేదని అంతా వదిలేశారు అని ఆరోపిస్తోంది.


కానీ విచిత్రంగా ఏపీలో చంద్రబాబుని తెలంగాణ ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ కీలక నాయకుడు కేటీఆర్ పొగిడారు. ఏపీ సీఎం బెజవాడలో చేపడుతున్న తుపాన్ అనంతరం చర్యలు సూపర్ అని అంటున్నారు. ఏపీ ప్రభుత్వం ఆరు హెలీ కాఫ్టర్లు, 150 రెస్క్యూ బోట్లతో సహాయ చర్యలు చేపడుతుందన్న కేటీఆర్ ఇది మెచ్చుకొని తీరాల్సిందే అంటున్నారు.


ఏపీ ప్రజలు ప్రాణాలను కాపాడుతూ వారికి తగిన సహాయం చేయడంలో ఏపీ ప్రభుత్వం ముందు ఉందని కేటీఆర్ అన్నారు. అదే తెలంగాణలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది అని ఘాటైన విమర్శలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఎన్ని హెలీ కాఫ్టర్లు, ఎన్ని బోట్లతో ఎంతమంది ప్రాణాలు కాపాడారో చెప్పాలని డిమాండ్ చేశారు.


భయంకరమైన తుపాన్ దాని ప్రభావంతో వరదల ముంచెత్తినా రేవంత్ సర్కారు ఘాడ నిద్రలో ఉందని సెటైర్లు వేశారు. తెలంగాణ ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ బిగ్ జీరో అని మార్కులు వేశారు. ఒక జేసీబీ డ్రైవర్ సోదరుడు తొమ్మిది మంది ప్రాణాలను కాపాడితే ప్రభుతవం అయి ఉండి ఏమి చేస్తోందని కేసీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.


ఆయన రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారు. ఈ సంగతి పక్కన పెడితే ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం బాగా పనిచేస్తుందని మార్కులు వేశారు. కాగా ఏపీ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని వైసీపీ విమర్శిస్తోంది. అసలు ఉదాసీన వైఖరి వల్లే వరదలు వచ్చాయని నిందిస్తోంది. మరి ఏపీలో వైసీపీకి తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రత్యర్థిగానే ఉంది. అందుకే పొగడటం లేదు అని అంటున్నారు. నిజానికి టీడీపీకి బీఆర్ఎస్ కూడా ప్రత్యర్థిగానే ఉంది. కానీ లౌక్యం తెలిసిన గులాబీ పార్టీ చంద్రబాబుని పొగుడుతూ రేవంత్ రెడ్డిని విమర్శిస్తోంది. మరి ఈ రకమైన లౌక్యం లేకపోవడం వల్లే వైసీపీ భారీ ఓటమి మూటగట్టుకోందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: