జనసేన అధినేతకు జడ్ ప్లస్ సెక్యూరిటీ.. వాళ్ల నుంచే పవన్ కు ముప్పు ఉందా?

Reddy P Rajasekhar
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీమకు సైతం అపకారం చేయరని సున్నిత మనస్కులని ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకునే విషయంలో ముందువరసలో ఉంటారని పొలిటికల్ వర్గాల్లో టాక్ ఉంది. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంలో పవన్ కీలక పాత్ర పోషించారు. అయితే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి పవన్ కు డిప్యూటీ సీఎం పదవి దక్కిన తర్వాత పవన్ కు సంఘ విద్రోహ శక్తుల నుంచి ముప్పు ఉందని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
 
పవన్ కళ్యాణ్ ను సంఘ విద్రోహ శక్తులు టార్గెట్ చేయడం ఏంటనే చర్చ సైతం పొలిటికల్ వర్గాల్లో జరుగుతుండటం కొసమెరుపు. పవన్ కు ఏపీ ప్రభుత్వం జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించే ఛాన్స్ అయితే ఉంది. పవన్ కళ్యాణ్ అంటే గిట్టని వాళ్లే పవన్ ను ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. పవన్ కు ప్రాణాపాయం అంటూ వస్తున్న వార్తలు ఫ్యాన్స్ ను తెగ టెన్షన్ పెడుతున్నాయి.
 
పవన్ ను టార్గెట్ చేసిన గ్రూపులకు సంబంధించిన వివరాలు సైతం త్వరలో వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లలో పాల్గొనడం కూడా కరెక్ట్ కాదని చెప్పవచ్చు. జగన్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న నేపథ్యంలో పవన్ కు సైతం జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తే మంచిదని చెప్పవచ్చు. వైసీపీ దారుణ పరాజయం నేపథ్యంలో పవన్ ను కొంతమంది టార్గెట్ చేసి ఉండవచ్చనే చర్చ సైతం జరుగుతోంది.
 
కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికల విషయంలో సైలెంట్ గా ఉండటం సైతం పవన్ కళ్యాణ్ కు మంచిది కాదని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడాల్సి ఉంది. వీలైనంత వేగంగా జడ్ ప్లస్ సెక్యూరిటీ దిశగా ఏపీ సర్కార్ అడుగులు పడితే మంచిది. పవన్ కు సంబంధించి వైరల్ అవుతున్న వార్తలు టీడీపీ శ్రేణులను సైతం భయాందోళనకు గురి చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: