వేణు స్వామి: జగన్.. కేసీఆర్ పై హాట్ కామెంట్స్..!

Divya
తెలుగు ప్రేక్షకులకు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి తెలియజేయాల్సిన పనిలేదు. గతంలో రాజకీయ నాయకుల సెలబ్రిటీగా జాతకాలను చెబుతూ నిరంతరం వార్తలలో నిలుస్తూ ఉండేవారు. ఇప్పటికి ఎంతోమంది స్టార్ హీరోల జాతకాల గురించి మాట్లాడడం జరిగింది వేణు స్వామి.. ఇలాంటి సందర్భాలలో లేనిపోని వివాదాలకు కాంట్రవర్సీలకు కారణమయ్యారు. చాలామంది సెలబ్రిటీల అభిమానులు వేణు స్వామి పైన చాలా దారుణంగా ట్రోల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.. మరికొన్ని సందర్భాలలో సెలబ్రిటీల రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలు చెప్పడంలో రివర్స్ అవ్వడం కూడా జరిగింది.

ఇదంతా పక్కన పెడితే 2024 ఎన్నికలలో చంద్రబాబు ఓడిపోతారని మళ్ళీ జగన్ సీఎం అవుతారని తన మాట తప్పితే కచ్చితంగా జాతకాలు చెప్పనట్టు తెలియజేసిన వేణు స్వామి అన్నట్టుగానే ఇకమీదట చెప్పను అంటూ వీడియో ద్వారా తెలియజేశారు. ఆ తర్వాత పబ్బులో కనిపించిన వేణు స్వామి.. తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉన్నారు. అయినా కూడా తనని చాలామంది ట్రోల్ చేశారు. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన వేణు స్వామి కేవలం తన దగ్గరకి వచ్చేవారికి కచ్చితంగా జాతకాలు చెప్పి వారికి తగ్గట్టుగా పరిహారం కూడా చేస్తానని తెలిపారు.. తానంతట తాను అయితే చెప్పనని కూడా తెలియజేయడం జరిగింది.

తాజాగా వేణస్వామి రాహుల్ గాంధీ, జగన్ ,కేసీఆర్ ఇప్పుడు ఓడిపోయిన నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్లకి కచ్చితంగా మంచి రోజులు వస్తాయని ఇది మీరే చూడండి అంటూ తెలియజేశారు.. తాను ఎవరికి జాతకాలు చెప్పడం లేదని క్రికెట్ ప్రీడక్షన్ కూడా ఇవ్వడం లేదని కానీ తన ఇంటికి వచ్చిన సెలబ్రిటీలకు మాత్రమే జాతకాలు చెబుతూ ఉన్నానని తెలిపారు.. క్రికెట్ లో కానీ రాజకీయాలలో కానీ తను చెప్పడం వల్ల చాలామంది బెట్టింగులు వేసి మోసపోతున్నారని ఆ విషయాలను తన వద్ద వరకు తీసుకువెళ్లడంతో ఇకమీదట ఇలాంటివి చెప్పనని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: