కూన రవికుమార్ Vs బెందాళం అశోక్.. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల మధ్య ఏం జరుగుతోంది..?
వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లపాటు ఇదే సామాజిక వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం స్పీకర్గా ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వంలో కాళింగ సామాజికవర్గం నుంచి ఎవరికీ కీలక పదవులు దక్కలేదు. అయితే తెలుగుదేశం నుంచి ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, ఆముదాలవలస నుంచి కూర రవికుమార్ ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ఇద్దరూ ఉత్తరాంధ్రలో అందులోనూ శ్రీకాకుళం జిల్లాలో బాగా వెనకబడిన కాళింగ సామాజిక వర్గానికి చెందిన నేతలే. కాళింగ సామాజిక వర్గానికి రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇచ్చాపురం నుంచి అశోక్ వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
పైగా 2019 ఎన్నికలలో జగన్ ప్రభంజనంలోనూ ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే కూన రవికుమార్ కాళింగ సామాజికవర్గంలో డేరింగ్ అండ్ డైనమిక్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి పార్టీని సమర్థవంతంగా నడిపించారు. పార్టీ కోసం కేసులు ఎదుర్కొన్నారు కూడా. పైగా సామాజిక వర్గంలో దూకుడుగా వెళతారన్న పేరున్న.. క్రేజ్ ఉన్న.. నాయకుడిగా కొనసాగుతున్నారు. మరి చంద్రబాబు కాళింగ సామాజిక వర్గానికి క్యాబినెట్లో అవకాశం ఇవ్వాలనుకుంటే.. ఆ పదవి అశోక్ వర్సెస్ రవికుమార్ లో ఎవరికి దక్కుతుంది అన్నది ప్రస్తుతానికి అయితే సస్పెన్స్ గానే ఉంది.