అసలే సెలక్టర్లు కోపంతో ఉంటే.. శ్రేయస్ అయ్యర్ ఏం చేశాడో తెలుసా?

praveen
గత కొంతకాలం నుంచి భారత యంగ్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ బీసీసీఐ సెలెక్టర్ల ఆగ్రహానికి గురవుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. గతంలో గాయం నుంచి కోలుకున్న సమయంలో దేశ వాలి క్రికెట్ ఆడి ఫామ్ నిరూపించుకోవాలని సెలెక్టర్లు అతనికి సూచించారు. అయినప్పటికీ సెలెక్టర్ల ఆదేశాలను సైతం బేకాతరూ చేయడంతో బిసిసిఐ అతని వైఖరి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి అతని తప్పించింది.

 అంతేకాదు శ్రేయస్ అయ్యర్ ను అటు జడ్డు నుంచి కూడా తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది అన్న విషయం తెలిసిందే. దీంతో అతని అభిమానులు అందరూ కూడా ఆందోళనకు గురయ్యారు. అయితే ఇలా శ్రేయస్ అయ్యర్ నూ జట్టు నుంచి తప్పించినప్పటికీ అతను తన ప్రతిభను ఉపయోగించుకుని తానేంటో నిరూపించుకుంటాడని త్వరలోనే మళ్లీ భారత జట్టులోకి పునరాగమనం చేస్తాడు అని ఎంతో మంది అయ్యర్ ఫ్యాన్స్ నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఇప్పటికే సెలెక్టర్లు అతనిపై కోపంగా ఉంటే ఇటీవలే అయ్యర్ చేసిన పని మాత్రం అభిమానులకు సైతం కోపం తెప్పిస్తుంది.

 ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో భాగంగా టీమిండియా క్రికెటర్లు అందరూ కూడా వరుస మ్యాచ్ లు ఆడుతూ బిజీబిజీగా ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ తీరు అభిమానులకు ఆగ్రహానికి గురిచేస్తుంది. ఇప్పటికే అతనిపై సెలెక్టర్లు కోపంతో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు ఫామ్ లో కూడా లేడు. పైగా సన్ గ్లాసెస్ ధరించి క్రీజు లోకి వచ్చాడు. ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడ అంటే అది కూడా లేదు. కేవలం 7 బంతులు మాత్రమే ఆడి ఒక్క పరుగు కూడా చేయకుండా డకౌట్ అయ్యాడు. దిలీప్ ట్రోఫీలో ఇండియా డి తరఫున ఆడుతున్న అయ్యర్ తాజా ప్రదర్శన అభిమానులకి కోపం తెప్పిస్తుంది. దీంతో ఎంతో మంది సోషల్ మీడియా జనాలు కూడా అతనిపై ఇంటర్నెట్లో ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: