త్వరలో పార్లమెంట్ సమావేశాలు.. అయోమయంలో పడ్డ మోడీ ప్రభుత్వం?
ఇలాంటి సమయంలో రాజ్యసభలో పూర్తిస్థాయి మెజారిటీ లేని ఎన్డీఏ కూటమికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది రాజ్యసభలో నలుగురు నామినేట్ సభ్యులు గత శనివారం పదవి విరమణ చేశారు అయితే వీరి పదవి విరమణతో అధికార బిజెపి బలం 86 పడిపోగా ఎన్డీఏ కూటమి బలం 101 గా ఉంది. 245 మంది సభ్యులు ఉండే రాజ్యసభలో ప్రస్తుతం 19 ఖాళీలు ఉన్నాయి. దీంతో మొత్తం సభ్యుల సంఖ్య 226 కు చేరింది. మెజారిటీ మార్క్ అంటే 114 రావాల్సిందే. ప్రస్తుతం ఎన్డీఏకు సంఖ్యాబలం దీనికంటే తక్కువగానే ఉంది.
దీంతో ఇక ఈ మద్దతు ఎక్కడినుంచి కూడా కూడగట్టుకోగలుగుతుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయిన అంశం అని చెప్పాలి. గతంలో వివిధ రకాల బిల్లును ప్రవేశపెట్టడం ఏకపక్షంగా ఆమోదించుకోవడం.. చేసిన ఎన్డీఏ కూటమి ఇక ఇప్పుడు మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇక వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లులపై ఓటింగ్ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది అని చెప్పాలి. బిజు జనతాదళ్, బారాసా వంటి తటస్థ పార్టీలు కీలకంగా మారబోతున్నాయి. అయితే బిజు జనతాదళ్ పార్టీకి 9 మంది ఎంపీలు ఉండగా ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో వీరు ప్రతిపక్ష వైపు కూర్చోవడం గమనార్హం. అయితే అన్న డీఎంకే వైకాప మద్దతుతో భాజపానికి అవకాశాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయ్. కానీ రాజకీయాల్లో ఎప్పుడూ ఎలాంటి అనూహ్యపరిణామాలు చేసుకుంటాయి అన్నది ఊహకందని విధంగానే ఉంటుంది ఏం జరగబోతుందో చూడాలి.