విజయసాయి వల్లే నా భార్య ప్రెగ్నెంట్..కేసు పెట్టిన అధికారి భర్త ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... వైసిపి అధికారం కోల్పోయిన తర్వాత.. ఆ పార్టీలో ఉన్న నేతలందరూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. వైసిపి పాలనలో చేసిన ఆ నేతల అవినీతిని తెలుగుదేశం ప్రభుత్వం బయటపెడుతోంది.దీంతో వైసిపి నేతలు గజగజ వణికి పోతున్నారు. కొంతమంది వైసీపీ నేతలు దేశం వదిలి కూడా పారిపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో... వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వివాదంలో చిక్కుకున్నారు.

రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పై తాజాగా ఏపీలో ఓ కేసు నమోదు అయింది. అయితే ఈ కేసు నార్మల్ ది అయితే పర్లేదు కానీ... ఓ మహిళా అధికారి ప్రెగ్నెన్సీ గురించి నమోదు కావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఏపీలోని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి పై... ఆమె భర్త మదన్ మోహన్.. సంచలన ఆరోపణలు చేస్తూ... ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు... శాంతి పై ఫిర్యాదు చేశారు ఆమె భర్త మదన్ మోహన్.

తాను విదేశాలలో ఉండగా... తన భార్య శాంతి... ప్రెగ్నెంట్ అయిందని తన ఫిర్యాదులో స్పష్టం చేశారు మదన్ మోహన్. తన భార్య గర్భానికి... కారణం వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అంటూ తన ఫిర్యాదులో మదన్ మోహన్ పేర్కొనడం వివాదంగా మారింది. అలాగే గవర్నమెంట్ fledar సుభాష్  కూడా దీనికి కారణం అని మదన్ మోహన్ సంచలన ఆరోపణలు చేయడం జరిగింది.

తన భార్య శాంతి అక్రమ సంతానానికి... అసలు తండ్రి ఎవరు? అనే దానిపై తనకు క్లారిటీ కావాలని దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు... మదన్ మోహన్ లేక రాశారు. దీంతో వెంటనే...  స్పందించిన దేవాదాయ శాఖ కమిషనర్  సత్యనారాయణ... శాంతిని సస్పెండ్ చేయడం జరిగింది. అటు ఇదే ఘటనపై... పోలీస్ స్టేషన్లో కూడా... మదనమోహన్ ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: