వైస్ సమాధి వద్ద కనీసం కూర్చోలేదు.. మీరా వారసులు?

Veldandi Saikiran
జగన్ మోహన్ రెడ్డితో పాటు టీడీపీ పార్టీలపై వైస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. నాన్న సమాధి వద్ద కనీసం కూర్చోలేదు.. మీరా వారసులు? అంటూ జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు వైస్ షర్మిల. వైసీపీ వైఎస్సార్ పార్టీ కాదు... అందులో వైఎస్ లేరు, వైఎస్ పథకాలు లేవు, వైఎస్ ఆశయాలు నిలబెట్టే వారు కూడా లేరని మండిపడ్డారు. వైఎస్సార్ ఆశయ సాధన కోసం జగన్ ఏం చేయలేదని నిప్పులు చెరిగారు.

అందుకే వైసీపీ ని ప్రజలు గొయ్యి తీసి పాతిపెట్టారని చురకలు అంటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టాల్ లీడర్ అన్నారు షర్మిల.
వైఎస్సార్ కు వైసీపీ కి సంబంధం లేదని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే యువజన శ్రామిక కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చురకలు అంటించారు వైస్ షర్మిల. బీజేపీ కి వైసీపీ తోక పార్టీ అని విమర్శలు చేశారు.

బీజేపీకి వైసీపీ ఊడిగం చేసిందని పేర్కొన్నారు. బిల్లుల ఆమోదం కోసం మాత్రమే కాదు అధికారంలో ఉన్న సమయంలో అన్ని విధాలుగా వైసీపీ బీజేపీకి తొత్తులుగా వ్యవహరించిందని ఆగ్రహించారు వైస్ షర్మిల. అధికారం కోల్పోయిన తర్వాత కూడా స్పీకర్ ఎన్నిక సహా అన్ని విషయాల్లో జగన్ బీజేపీకి అండగా నిలిచారని ఆగ్రహించారు.  వైఎస్సార్ విగ్రహాల జోలికి వెళ్ళ వద్దని టీడీపీ వారికి హెచ్చరిక చేస్తున్నామని తెలిపారు. ఈ సారి వైఎస్సార్ విగ్రహాలు ధ్వంసం చేస్తే ఇకపై అక్కడకు వెళ్లి ఆందోళన చేస్తానని వార్నింగ్ ఇచ్చారు వైస్ షర్మిల.
వైసీపీ చేసిన హత్యా రాజకీయాలపై విసుగు చెంది టీడీపీకి ప్రజలు పట్టం కట్టారని వెల్లడించారు. మళ్ళీ టీడీపీ అదే పని చేస్తే వైసీపీ కి మాదిరి టీడీపీకి ప్రజలు బుద్ధి చెబుతారని వార్నింగ్ ఇచ్చారు.  టీడీపీ గూండాలు వైఎస్సార్ విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు... ఉమ్మడి రాష్ట్రానికి రెండు సార్లు నాయకుడిగా సేవలు అందించారన్నారు.  టీడీపీ కార్యకర్తల విషయంలో చంద్రబాబు స్పందించాలి... వైసీపీ నేతలు హత్యా, గుండా రాజకీయాలు చేసి ఉండవచ్చు అన్నారు. వైసీపీ నేతలు చేసిన పనికి వైఎస్సార్ విగ్రహాలను టీడీపీ నేతలు ధ్వంసం చేయటం తగదని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: