కేటీఆర్‌ ను ఆడుకుంటున్న ఏపీ నేతలు...ఊరికే గెలుక్కున్నాడు?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడుఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో... తెలంగాణ గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... ఏపీ రాజకీయాలపై మాట్లాడడం ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపు తోంది. కేటీఆర్ చేసిన వ్యాఖ్యల తో ఏపీ లో ఉన్న... కూటమి నేతలందరూ ఒకే తాటిపైకి వచ్చి... మాజీ మంత్రి కేటీఆర్ ను ఒక ఆట ఆడుకుంటున్నారు. ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ గులాబీ పార్టీని ఓడించినా, కేటీఆర్ చెల్లెలు కవితను జైలు కు పంపిన... కేటీఆర్ కు పొగరు తగ్గలేదు అంటూ టిడిపి నేతలు ఫైర్ అవుతున్నారు. వాస్తవంగా మొన్న ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్... చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. అసలు ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు...  అనే విషయం ఎవరికీ అర్థం కావడం లేదు అంటూ పేర్కొన్నారు.

ఏపీలో జగన్మోహన్ రెడ్డి గెలవాల్సిందని.. కానీ కొంతమంది కుట్రలు చేశారని ఫైర్ అయ్యారు.  ముఖ్యంగా నిత్యం ప్రజల్లో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి.. కూడా ఓడిపోయాడంటే... ఏపీ ఎన్నికలపై అనుమానం వస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అంతే కాకుండా.... షర్మిలను వాడుకొని... మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు కుట్రలు చేశారని తెలుగుదేశం కూటమిపై ఫైర్ అయ్యారు.
 
అయితే దీనిపై...తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సోమిరెడ్డి... ఫైర్ అయ్యారు.  తెలంగాణలో... ప్రజల కష్టాలను పట్టించుకోవాల్సింది పోగా... ఏపీ రాజకీయాలు నీకెందుకు అంటూ... కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. గులాబీ పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు నేలకేసి కొట్టిన కూడా... కేటీఆర్ కు పొగరు తగ్గలేదని ఫైర్ అయ్యారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు... కేటీఆర్ చేసిన పోస్ట్... దెబ్బకు... గులాబీ పార్టీ ఓడిపోయిందని సోమిరెడ్డి విమర్శలు చేశారు.  అటు మంత్రి సత్య కుమార్ కూడా కేటీఆర్ పై మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: