టీడీపీ మాధ‌వీరెడ్డికి కోపం వ‌చ్చింది... ఫుట్‌బాల్ ఆడుకున్నారుగా..?

RAMAKRISHNA S.S.
ఏపీలో కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంత భారీ మెజార్టీతో కూటమి ప్రభుత్వంలోకి వచ్చినా కూడా వైసీపీకి చెందిన కొందరు నేతలు ఇంకా గిల్లికజ్జాలు మానడం లేదు. తమకు ప్రోటోకాల్ కావాలి.. తాము చెప్పినట్టు జరగాలి.. అంటూ రాద్ధాంతాలు చేస్తున్నారు. ఇంకా తమ ప్రభుత్వం అధికారంలో ఉందన్న భ్రమలోనే వారు మునిగి తిరుగుతున్నారు. ఇలా వ్యవహరిస్తున్న నేతలకు టీడీపీ నేతలు కూడా అదే తరహాలో కౌంటర్లు ఇచ్చి నోళ్లు మూయిస్తున్నారు.

తాజాగా కడప రెడ్డమ్మగా బాగా పాపులర్ అయిన కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి.. కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో వైసీపీకి చెందిన ఓ లేడీ కార్పొరేటర్ చేసిన ఓవరేక్షన్‌కు అదిరిపోయే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి రెడ్డి వైసీపీకి చెందిన కార్పొరేటర్ ఉమాదేవి మధ్య చిన్నగా మొదలైన గొడవ ... పెద్దగా మారింది. తన డివిజన్‌లో పింఛన్‌లు పంపిణీ చేశారని.. తనకు ఎందుకు? సమాచారం ఇవ్వలేదని.. ఎమ్మెల్యే మాధవి రెడ్డిని కార్పొరేటర్ గట్టిగా ప్రశ్నించారు. బయటనుంచి వచ్చిన వ్యక్తులు పింఛన్‌లు ఎలా? ఇస్తారని ఉమాదేవి ఎమ్మెల్యేను నిలదీయడంతో.. మాధవికి తిక్క రేగిపోయింది.

వెంటనే ఆమె కార్పొరేటర్ ను తనదైన వాగ్దాటితో ఆడుకున్నారు. మీరేమైనా కార్పొరేషన్ కొన్నారా..? మీ పేరు పై రాయించుకున్నారా..? అని గట్టిగానే వాయించేశారు. 50 డివిజన్లు ఉన్న కడప కార్పొరేషన్ లో అందరూ వచ్చారని.. మీరు ఒకరే ఎందుకు..? రాలేదని తిరిగి కార్పొరేటర్‌ను ఎమ్మెల్యే మాధవి రెడ్డి ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం అని.. ఎవరింట్లో పెళ్లి కాదని.. కార్డు ఇచ్చి పిలవడానికి అని ప్రశ్నించడంతో ఉమాదేవి.. మాధవి రెడ్డిని అక్క అంటూ ఏదో చెప్పే ప్రయత్నం చేసిన ఆమె వినిపించుకోలేదు. చివరకు కార్పొరేటర్ మారు మాట్లాడకుండా సైలెంట్ అయ్యి తన కుర్చీలో కూర్చున్నారు. ఏది ఏమైనా మాధవి రెడ్డి తనదైన స్టైల్ లో వైసీపీకి వార్నింగ్‌లు ఇచ్చుకుంటూ కడపలో రాజకీయాన్ని హీటెక్కిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: