ఏపీ: మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో మాజీ ఎమ్మెల్యే..!

Divya
ఆంధ్రప్రదేశ్లో వైసిపి పార్టీ 2024 ఎన్నికలలో కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. దీంతో వైసీపీ నేతలు గతంలో విర్రవీగినప్పటికీ ఇప్పుడు చాలా సైలెంట్ గా మారిపోయారు. కానీ కూటమి ప్రభుత్వము అధికారులు నేతలు మాత్రం నానా రచ్చ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గానికి చెందినటువంటి వైసీపీ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పైన ఫోక్స్  కేసు నమోదు అయినట్లుగా తెలుస్తోంది. మరి ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పైన ఒక మైనర్ బాలిక పైన లైంగిక వేధింపులు గురి చేశారనే విధంగా ఆరోపణలు వచ్చాయి.. దీంతో ఇంట్లో ఉన్నటువంటి ఈ మాజీ ఎమ్మెల్యే అని పోలీసుల సైతం అదుపులోకి తీసుకొని ఒక రహస్య ప్రారాంతానికి తీసుకు వెళ్లారనే విషయం వినిపిస్తోంది..ఎన్నికలకు ముందు సుధాకర్ పైన పలు రకాల ఆరోపణలు కూడా వినిపించాయి. ఆ బాలిక పై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ విషయం రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.. ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే సుధాకర్ను పోలీసులు సైతం అదుపులోకి తీసుకొని మరి ప్రశ్నిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదే సమయంలోనే ఆయన పైన ఫోక్స్  చట్టం కింద కేసు నమోదు చేసినట్లుగా సమాచారం. మాజీ ఎమ్మెల్యే సుధాకర్ వ్యవహారం ఇప్పుడు కోడుమూరులో పాటు ఆంధ్రప్రదేశ్లోని ఒక సంచలనంగా మారిపోయిందని చెప్పవచ్చు. మరి ఈ విషయం పైన ఆ వైసిపి మాజీ ఎమ్మెల్యే ఏమంటారో మరి అధినేత ఏమంటారు అనే విషయం పైన ఇప్పుడు అందరూ ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం లో వచ్చిన తర్వాత చాలా మంది వైసిపి నేతలపైన కేసులను బకాయిస్తూ లోపలికి వేయించేలా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: